అన్వేషించండి

Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు

Easy Trick to Reduce Blood Sugar Spikes : రోజుకు కేవలం 15 నిమిషాల నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయా? డాక్టర్లు ఏమంటున్నారు.. నడకకు, మధుమేహానికి ఉన్న లింక్ ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధుమేహ నియంత్రణకు నడక కీలకం; సహజంగా చక్కెర తగ్గుతుంది.
  • భోజనం తర్వాత 15 నిమిషాల నడక రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
  • నడకతో ఇన్సులిన్ పనితీరు, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి.
  • రోజుకు 10-15 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా పెంచండి.

15 Minute Walk Can Help Reduce Blood Sugar : మధుమేహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. షుగర్ ఉన్న చాలామంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులపై ఆధారపడుతుంటారు. అయితే లైఫ్​స్టైల్లోని కొన్ని మార్పులు కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో నడక ఒకటి.

రోజుకు కేవలం 15 నిమిషాలు నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగానే తగ్గించుకోవచ్చని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ అరోరా వెల్లడించారు. అసలు నడకకు, మధుమేహానికి ఉన్న సంబంధం ఏంటి? షుగర్ ఎలా కంట్రోల్ అవుతుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నడకతో షుగర్ ఎలా తగ్గుతుంది?

నడక ప్రారంభించిన వెంటనే శరీరంలోని కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ను ఉపయోగించడం మొదలుపెడతాయి. రక్తంలో ఉన్న చక్కెరను కండరాలు స్పాంజ్‌లా గ్రహిస్తాయని డాక్టర్ అరోరా చెబుతున్నారు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. ఒక వ్యక్తి 15 నిమిషాల నడకతో.. కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్ (CGM) డేటాలో గ్లూకోజ్ స్థాయిలు చెక్ చేసుకుంటే.. అది 107 mg/dL నుంచి 96 mg/dLకు తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

భోజనం తర్వాత నడిస్తే..

భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల ఆ గ్లూకోజ్‌ను కండరాలు వినియోగించుకుంటాయి. దీంతో భోజనం తర్వాత వచ్చే షుగర్ స్పైక్స్‌ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ అలవాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

నడక కేవలం షుగర్‌ను తగ్గించడమే కాదు.. శరీరంలోని ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా నడిస్తే.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమంగా తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగై మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 

ఎక్కువసేపు నడవాలా?

మంచి ఫలితాలు రావాలంటే గంటల తరబడి నడవాలని అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో గంటలు నడవడం కంటే.. రోజూ 10 నుంచి 15 నిమిషాల నడకతో ప్రారంభించినా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్తున్నారు. 

మొదట రోజుకు 10-15 నిమిషాలతో ప్రారంభించండి. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి. స్టెప్స్‌ను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించండి. ఉదయం, లంచ్ బ్రేక్ లేదా సాయంత్రం వేళల్లో వాక్ చేయండి. రోజుకు 30 నిమిషాలు లేదా 10 వేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయండి. నడకకు ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేస్తే మంచిది. సౌకర్యవంతమైన షూలు వేసుకోండి. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget