అన్వేషించండి

Curd: పెరుగు ఇలా తినకూడదు అని చెబుతున్న ఆయుర్వేదం

పెరుగు అన్నం తినకుండా భోజనం ముగించరు చాలా మంది. కానీ రోజు పెరుగు తినడం మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది.

భోజనం చివర్లో పెరుగుతో ముగించనిదే కొంతమందికి అన్నం తిన్న సంతృప్తి ఇవ్వదు. అనేక మంది ఇళ్ళల్లో పెరుగు ప్రధానమైన ఆహారం. ఇది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ తొలగించేందుకు సహాయపడుతుంది. పెరుగు ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచి అధిక రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. అందుకే పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతారు.

శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తినమని అంటారు. మరి వచ్చేది చలికాలం.. జలుబు, దగ్గు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమయంలో పెరుగు తింటే జలుబు ఎక్కువ అవుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ చలి కాలంలో కూడా పెరుగు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయుర్వేద నిపుణులు చెప్పుకొచ్చారు. కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. బరువు పెరుగుతామనే భయం కూడా అవసరం లేదు. అయితే పెరుగు తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పెరుగు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే ప్రతి రోజు పెరుగు తినకూడదని ఆయుర్వేదం భావిస్తోంది. పెరుగు ఆరోగ్యానికే మంచిదే అయినప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలి. అందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

రాత్రిపూట వద్దు

రాత్రి వేళ కఫ దోషం అత్యధికంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కఫ దోషం పెరగడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది.  అందుకే రాత్రి వేళ ఎక్కువగా పెరుగు తినకూడదని చెప్తారు. దానికి బదులుగా మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

వేడి చెయ్యకూడదు

ఫ్రిజ్ లో పెట్టి తీసిన తర్వాత చల్లగా ఉందని పెరుగు కూడా వేడి చేసేస్తున్నారా? అలా అసలు చెయ్యకూడదు. పెరుగు వేడి చేసి తీసుకుంటే శరీరం వాపుకు దారి తీస్తుంది. అంతే కాదు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. అందుకే పెరుగు ఎప్పుడు వేడి చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది.

రోజూ తినక పోవడమే మంచిది

రోజు పెరుగు తినడం చాలా మందికి అలవాటు. కానీ అలా ప్రతి రోజు తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో మంటని పెంచుతుంది. దాని వల్ల శరీరంలో కఫ, పిత్త దోషాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు. అందుకే రోజు పెరుగు తినే అలవాటు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించండి.

రుతుస్రావం అప్పుడు వద్దు

పీరియడ్స్ లో ఉన్నప్పుడు పెరుగు తినకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. అది నిజమే.. ఎందుకంటే పెరుగు వేడిని పెంచుతుంది. దీని వల్ల పిత్త దోషంపెరుగుతుంది. అధిక రుతుస్రావం, నాసికా రక్తస్రావం జరుగుతున్నప్పుడు భోజనంలో పెరుగుని తీసుకోకపోవడమే ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఓ మై గాడ్, మీ కాళ్లు ఇలా వాచిపోతున్నాయా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget