అన్వేషించండి

Ayurveda Tips : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ ఇవే, పెరుగు నుంచి శనగపిండివరకు.. ఆరోగ్యానికి మంచిది కాదంటోన్న నిపుణులు

Kadhi in Monsoon : ఢిల్లీలోని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రీనా శర్మ మాట్లాడుతూ.. వర్షాకాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది కాబట్టి కొన్ని ఫుడ్స్ తినొద్దని సూచిస్తున్నారు అవేంటంటే..

Ayurvedic Monsoon Tips : మాన్​సూన్​లో చినుకులు, చల్లని గాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. వర్షాకాలంలో ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలట. వాటిలో కడీ వంటి వంటకాలు కూడా ఉన్నాయి. పెరుగు, శనగపిండితో చేసే దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని.. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. మరి కడీని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంపై ఎందుకు శ్రద్ధ వహించాలంటే..

ఆయుర్వేదంలో వర్షాకాలంను వర్ష ఋతువు అంటారు. ఈ సమయంలో శరీరంలోని జీర్ణశక్తి బలహీనపడుతుంది. అలాగే ఈ సీజన్‌లో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఢిల్లీకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రీనా శర్మ మాట్లాడుతూ.. "వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అటువంటి పరిస్థితిలో భారీ, నూనెతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. దానిలో కడీకి దూరంగా ఉండాలని ఆయుర్వేదం సూచిస్తుంది". పెరుగు, శనగపిండితే చేసే ఈ ఫుడ్ జీర్ణమవ్వడం కష్టమని తెలిపారు. 

కడీ ఏంటి?

ఆయుర్వేదం ప్రకారం.. కడీని కూరను పెరుగు, శనగపిండి, మసాలా దినుసులతో తయారు చేస్తారు. పెరుగులో శనగపిండి వేసి.. దానిని నీటితో పలుచగా కలిపి.. మసాలాలు వేసి ఉడికిస్తారు. దీనిని అన్నం, రోటీలలో తింటారు. ఇది నోటికి మంచి రుచిని ఇస్తుంది. అయితే ఇది వర్షాకాలంలో తినేందుకు హానికరమైన ఫుడ్ కావచ్చు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు ఎందుకు తినకూడదంటే

కడీలో ప్రధానమైనది పెరుగు. దీనిని ఆయుర్వేదంలో చల్లని ఆహారంగా పరిగణిస్తారు. అయితే వర్షాకాలంలో తేమ కారణంగా శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. పెరుగు ఈ కఫాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు వస్తాయి. బెంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ అనిల్ మంగళ్ ప్రకారం.. "వర్షాకాలంలో పెరుగుతో చేసిన ఆహారాలు.. కడీ వంటి వాటిని నివారించండి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కఫాన్ని పెంచుతాయి".

శనగపిండితో వచ్చే సమస్య ఇదే

కడీలో శనగపిండిని కూడా ఉపయోగిస్తారు. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. శనగపిండి దానిపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. సూప్ లేదా కిచిడి వంటి తేలికైన, వేడి ఆహారాలు వర్షాకాలంలో ఉత్తమమైనవిగా చెప్తారు. ఆ సమయంలో శనగపిండితో చేసిన వాటిని నివారించాలి.

మసాలా దినుసులు, నూనె 

కర్రీకి తాలింపు వేయడానికి నూనె మరియు ఇంగువ, జీలకర్ర, ఆవాలు వంటి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. ఎక్కువ మసాలా దినుసులు, నూనె పిత్త దోషాన్ని పెంచుతాయి. దీనివల్ల అసిడిటీ, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో తక్కువ మసాలా దినుసులు, తక్కువ నూనెతో చేసిన ఆహారాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

బ్యాక్టీరియా ప్రమాదం

వర్షాకాలంలో తేమ కారణంగా పెరుగులో బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా పెరుగుతాయి. కర్రీని సరిగ్గా నిల్వ చేయకపోతే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని విషం చేయడం లేదా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

కాబట్టి వర్షాకాలంలో పెరుగు, శనగపిండి, మసాల, నూనెకు సంబంధించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకుంటే మంచిదని.. ఈ మార్పు వల్ల కడుపులో భారం, గ్యాస్ లేదా అతిసారం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Daily Habits Affecting Productivity : మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
Gym Headphones : జిమ్‌లో హెడ్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే మీ చెవులకు ముప్పు తప్పదంటోన్న నిపుణులు
వర్కవుట్ చేస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్‌ వాడుతున్నారా? నిపుణులు ఇస్తోన్న ప్రమాద హెచ్చరికలు ఇవే.. 
Washing Machine Tips : వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
Grapes Cleaning Tips : ద్రాక్ష పండ్లు ఇలానే శుభ్రం చేసి తినాలి.. లేదంటే పిల్లలకు, పెద్దలకు ప్రమాదమే
ద్రాక్ష పండ్లు ఇలానే శుభ్రం చేసి తినాలి.. లేదంటే పిల్లలకు, పెద్దలకు ప్రమాదమే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget