అన్వేషించండి

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే

TGPSC Group 2 Exams | తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఈ నియమాలు పాటించాలి.

TSPSC Group 2 Exams | హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 పోస్టుల భర్తీకి  గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం నాడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు రోజుకు రెండు పేపర్ల చొప్పున నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

డిసెంబర్ 9న హాల్ టికెట్లు విడుదల

783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగా, మొత్తం 5,51, 847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9న టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58 రిజీయన్ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం, సోమవారాల్లో 2 రోజుల పాటు, రోజుకు 2 పేపర్ల చొప్పున మొత్తం 4 పేపర్లలో ఎగ్జామ్ జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 మల్టిపుల్ ఛాయిలస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 పేపర్లలో కలిపి 600 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 600 మార్కులు. 

ఆది, సోమవారాల్లో డిసెంబర్ 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్ లలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పేపర్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్ లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. సోమవారం సైతం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ ఇదే సమయాలలో జరగనున్నాయి. 

అభ్యర్థులు ఈ విషయాలు పాటించాలి.
- అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌లోకి ఉదయం ఉదయం 8.30 నుంచి 9.30 లోపే చేరుకోవాలి. ఉదయం వేళ 9.30 తరువాత ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
- మధ్యాహ్నం వేళ 1.30 నుంచి 2.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2.30 కు గేట్స్ క్లోజ్ చేస్తారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 
ప్రతి పేపర్ పరీక్ష ప్రారం భానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 కి గేట్లు మూసివేత
- హాల్ టికెట్ తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడెంటింటి కార్డు తీసుకుని వెళ్లాలి.
- మీ హాల్ టికెట్‌కు లేటెస్ట్ ఫొటో ఒకటి అతికించాలి. కనీసం మీ వెంట ఫొటో తీసుకెళ్తే ఎగ్జామ్ సెంటర్ వద్దనైనా అతికించక తప్పదు.
- అభ్యర్థులు బ్లూ లేదా ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి. వైట్‌నర్, మార్కర్ లాంటి వాటికి అనుమతి లేదు. పేపర్లు, అదనపు స్టేషనరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. 
- షూస్‌ ధరించిన వారిని ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరని గమనించాలి. 
- మహిళా అభ్యర్థులను మంగళ సూత్రం, గాజులు మాత్రమే అనుమతి ఉంది. మరే ఇతర ఆభరణాలతో వచ్చినా వారిని సైతం ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
- ఓఎంఆర్ షీట్ పైన ఎలాంటి సింబల్స్, గుర్తులు రాయకూడదు. కేవలం అందులో సూచించిన విషయాలకు మాత్రమే సమాధానం రాయాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ గానీ, ఎగ్జామ్ పేపర్ షీట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ నెంబర్ గానీ రాంగ్ బబులింగ్ చేసినా, తప్పుగా రాసినా వేరే ఓఎంఆర్ మాత్రం ఇవ్వడం కుదరదని గమనించి జాగ్రత్తగా పరీక్ష రాయాలి.

Also Read: NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
UPSC Result 2025: రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget