అన్వేషించండి

AP DSC 2024: ఏపీ డీఎస్సీకి కొత్త షెడ్యూలు? ఈరోజు హాల్‌టికెట్లు లేనట్లే! ఇక ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ!

Andhra Pradesh DSC 2024: ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసి, కొత్త షెడ్యూలును ప్రకటిస్తే.. టెట్ ఎగ్జామ్‌ ముగిసిన నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ నుండి డీఎస్సీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది.

AP DSC 2024: ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నాలుగేళ్లుగా మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా టెట్ (AP TET), డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్లు విడుదల చేసింది. కేవలం 50 రోజుల వ్యవధిలో టెట్, డీఎస్సీ పరీక్షలు పూర్తి చేయాలని భావించింది. అయితే మార్చి 4న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టెట్ పరీక్షలకూ, డీఎస్సీ పరీక్షలకూ మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్న సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ఆధారంగా అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించి షెడ్యూల్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. దీంతో పరీక్షలపై ముందుకెళ్లాలా? కొత్త షెడ్యూలు ప్రకటించాలా? అన్నది ప్రభుత్వం యోచిస్తోంది. 

ఒకవేళ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసి, కొత్త షెడ్యూలును ప్రకటిస్తే.. టెట్ ఎగ్జామ్‌ ముగిసిన నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ నుండి డీఎస్సీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని కోర్టు తెలిపింది. మరోవైపు పేపర్‌-1 ఎస్‌జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో మాత్రమే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. 

టెట్‌ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసి.. ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 9తో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. మరోవైపు.. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి.. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే.. టెట్‌, డీఎస్సీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ విడుదల నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తదనంతరం జారీ చేసే తుది కీ ప్రక్రియకు చాలా తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొంది.

మరో 5 రోజుల్లో టెట్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా జరిగినా డీఎస్సీ పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించే సరికి మే నెల వచ్చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విద్యాశాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ALSO READ:

'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్ర్కీనింగ్ టెస్ట్) పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ మార్చి 8న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget