Patanjali : మైక్రోప్లాస్టిక్ ముప్పు నుండి ఊపిరితిత్తులకు రక్షణ- పతంజలి పరిశోధనలో కీలక విషయాలు!
Patanjali Claims : మానవ రక్తం, ఊపిరితిత్తుల్లోకి ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయి. పతంజలి రూపొందించిన బ్రాంకోమ్ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

Health News: నేడు ప్లాస్టిక్ లేని చోటు లేదు. మనం తాగే నీళ్ల బాటిల్, పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్, పాల ప్యాకెట్లు, మందుల ప్యాకింగ్.. ఇలా ప్రతి వస్తువులో ప్లాస్టిక్ నిండిపోయింది. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు కేవలం బయటి ప్రపంచానికే పరిమితం కాకుండా, మైక్రోప్లాస్టిక్ రూపంలో మన శరీరాల్లోకి ప్రవేశిస్తోంది.
5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఈ ప్లాస్టిక్ కణాలు ఆవాల గింజ కంటే చిన్నవిగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం నుండి సముద్ర గర్భం వరకు ప్రతిచోటా ఇవి విస్తరించాయి. గాలి, ఆహారం, నీటి ద్వారా సగటున ఒక మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ను శరీరంలోకి తీసుకుంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశువు వరకు కూడా చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఊపిరితిత్తులపై ప్రభావం- ప్లాస్టిక్ నుండి ఫైబ్రోసిస్ వరకు
శరీరంలోకి చేరిన మైక్రోప్లాస్టిక్ కణాలు ప్రధానంగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల కణాలను గట్టిపరుస్తాయి. దీనివల్ల ఫైబ్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు సరిగ్గా గాలిని పీల్చుకోలేవు. మన శ్వాస వ్యవస్థ సుమారు 2400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వ్యవస్థలోని ప్రతి భాగానికి మైక్రోప్లాస్టిక్ ముప్పు పొంచి ఉంది.
పతంజలి పరిశోధన ఫలితం- బ్రాంకోమ్
2022లో ఊపిరితిత్తుల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు చేరినట్లు ఒక పరిశోధనా పత్రం వెల్లడించింది. దీనిపై 2023 నుండి పతంజలి రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిశిత అధ్యయనం చేపట్టారు. ఆయుర్వేదం ద్వారా మైక్రోప్లాస్టిక్ ప్రభావాలను తగ్గించవచ్చని వారు కనుగొన్నారు. ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి, బలోపేతం చేయడానికి 'బ్రాంకోమ్' అనే ఔషధాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
శాస్త్రీయ ఆధారాలు - పరిశోధన ప్రక్రియ
ఈ పరిశోధనలో భాగంగా మైక్రోప్లాస్టిక్ ప్రభావానికి గురైన ఎలుకలకు బ్రాంకోమ్ ఔషధాన్ని ఇచ్చారు. శ్వాస వ్యవస్థ పనితీరును కొలిచే 'ఫ్లెక్సివెంట్ సిస్టమ్' (Flexivent System) ద్వారా ఫలితాలను విశ్లేషించారు. బ్రాంకోమ్ మోతాదును బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
సూక్ష్మదర్శిని పరీక్షలు ఏం చెబుతున్నాయి
ఊపిరితిత్తుల్లోని ద్రవాలను సేకరించి పరీక్షించగా, మైక్రోప్లాస్టిక్ వల్ల పెరిగిన ల్యూకోసైట్లు, న్యూట్రోఫిల్స్ వంటి రోగనిరోధక కణాల స్థాయి బ్రాంకోమ్ వాడకంతో క్రమంగా తగ్గింది. అంతేకాకుండా, వాపును కలిగించే జన్యువుల (IL-6, IL-8, TNF-alpha) ప్రభావాన్ని కూడా ఈ మందు సమర్థవంతంగా నియంత్రించింది.
కణజాల పరీక్షల్లో స్పష్టమైన మార్పులు
ఊపిరితిత్తుల కణజాల పరీక్షలు (Histopathology) మైక్రోప్లాస్టిక్ వల్ల దెబ్బతిన్న శ్వాసనాళాలు తిరిగి పూర్వస్థితికి చేరుకున్నట్లు నిరూపించాయి. గాలి ప్రసరణ వేగం, ఊపిరితిత్తుల సాగే గుణం మెరుగుపడ్డాయి. మానవ కణాలపై (THP-1 cell line) చేసిన ప్రయోగాలు కూడా సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
ఆధునిక సమస్యకు ఆయుర్వేద పరిష్కారం
మైక్రోప్లాస్టిక్ ముప్పు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో, బ్రాంకోమ్ వంటి ఆయుర్వేద మందులు కొత్త ఆశను కలిగిస్తున్నాయి. అంకితభావంతో పరిశోధనలు చేస్తే, ఆధునిక ఆరోగ్య సమస్యలకు పురాతన ఆయుర్వేద చికిత్సలు సరైన పరిష్కారం చూపుతాయని ఈ అధ్యయనం నిరూపించింది.
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.























