అన్వేషించండి

రోగాలు రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయాలి

వైరస్, బ్యాక్టీరియా దాడులు మానవాళిపై పెరిగిపోతున్నాయి. ఇలాంటి కాలంలో తినే ఆహారాన్ని శుభ్రం చేసుకోవడం అవసరం.

ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినాల్సిన అవసరం ఉంది. అయితే తినే ముందు వాటిని శుభ్రపరచడం ముఖ్యం. చాలామంది నీటిలో వేసి ఇలా ముంచి అలా తీసేస్తారు. అలా చేయడం వల్ల త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని సరిగా శుభ్రం చేయకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. పండ్లు లేదా కూరగాయలు పొలంలో పెరిగడం,  వాటిని కోసాక నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి సమయాల్లో వాటిపై కొన్ని కలుషితాలు చేరే అవకాశం ఉంది. కలుషితమైన నేల, నీరు వంటి వాటికీ అవి బహిర్గతం కావడం వల్ల లేదా ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ వంటి విషయాల్లో అతి రసాయన మార్పులకు కూడా గురి కావచ్చు. కాబట్టి వాటిని తినే ముందు సరిగా శుభ్రం చేసుకోవడం అవసరం.

సాధారణంగా వాటిని మార్కెట్లలో అమ్ముతారు. మార్కెట్లలో పరిశుభ్రత తక్కువ ప్రమాణాలను కలిగి ఉంటుంది. పేలవమైన పారిశుధ్యం వల్ల జీర్ణాశయాంతర రుగ్మతలు రావచ్చు. పండ్లు, కూరగాయలపై సూక్ష్మజీవులు చేరి అవి సరిగా కడగక పోవడం వల్ల మన పొట్టలో చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కాబట్టి వాటిని తినే ముందు లేదా వండే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 

1. పండు లేదా కూరగాయలు కోయడానికి ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
2. పండు లేదా కూరగాయ పొట్టు తీసే వీలుంటే, అలా తీసేసి తినడం మంచిది. 
3.  ఆకుకూరలు లేదా పువ్వుల్లాంటివి  పెద్ద గిన్నెలో చల్లని నీటిలో వేసి రెండు నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టాక ఆకుకూరలను చేత్తో రుద్ది కడగడం చాలా ముఖ్యం.
4. స్ట్రాబెర్రీలు వంటి సున్నితమైన పండ్లను చల్లని నీటిలో వేసి కాసేపు ఉంచి శుభ్రమైన టవల్ తో తుడవాల్సిన అవసరం ఉంది.
5. మార్కెట్లో వెజిటబుల్ బ్రష్‌లు దొరుకుతున్నాయి. వాటితో పండ్ల పైన రుద్దడం వల్ల కూడా కలుషితాలు పోవచ్చు.
6. పుట్టగొడుగులను కూడా చల్లటి నీటిలో వేసి కడగాలి. తరువాత వాటిని శుభ్రమైన క్లాత్ తో తుడవాలి. 

పండ్లు కూరగాయలు వంటి వాటిని కడగడానికి సబ్బు లేదా డిటర్జెంట్ ను ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. మార్కెట్లో వెజిటబుల్ వాష్‌లు, ప్రోడక్ట్ వాష్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.  చాలామంది వీటిని వాడుతూ ఉంటారు.  కానీ వీటిని వాడడం కూడా అనవసరమే. ఎందుకంటే నీటితో శుభ్రం చేస్తేనే కలుషితాలు అధికంగా పోతాయి. ఈ వాష్‌ల వాడడం వేస్టు.  

Also read: ఇలా స్వీట్ నిమ్మ పొడిని రెడీ చేస్తే, ఇనిస్టెంట్‌గా నిమ్మరసం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget