అన్వేషించండి

Manchu Vishnu: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు

‘‘పవన్ కళ్యాణ్‌, నేను మాట్లాడుకోలేదని మీడియాలో చర్చ జరిగింది. మేం వేదిక మీదకు వచ్చే ముందే మాట్లాడుకున్నాం’’ అని విష్ణు తెలిపారు.

‘మా’ ఎన్నికల్లో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. సోమవారం మంచు విష్ణుతోపాటు ఆయన తండ్రి మోహన్ బాబు, సోదరి మంచు లక్ష్మి, ప్యానల్ సభ్యులు బాబు మోహన్, శివబాలాజీ తదితరులతో కలిసి తిరుమలకు వెళ్లారు. వేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత శ్రీవిద్యానికేతన్‌లో విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘అసోసియేషన్‌లోని చాలా విషయాల్లో బైలాస్‌ను మార్చాలనుకుంటున్నా. బైలాస్‌ మార్చడమంటే అంత ఈజీ కాదు. దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. ఎవరుపడితే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని నేను భావిస్తున్నా. ప్రకాశ్‌ రాజ్‌ సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారు. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదు. ఆ రోజు రాత్రి ఆలస్యం కావడంతో తర్వాతి రోజు కౌంటింగ్ కొనసాగించారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కు. ప్రకాశ్‌రాజ్‌, నాగబాబుల రాజీనామాను ఆమోదించలేదు. త్వరలోనే దీనిపై ప్రకాశ్‌ రాజ్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తా’’ అన్నారు. 

పవన్‌తో మాట్లాడా..: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు.. మాట్లాడుకోలేదని వస్తున్న వార్తలపై విష్ణు స్పందించారు. ‘‘చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలయ్ బలయ్ కార్యక్రమం వేదిక పైకి రాకముందే పవన్ కళ్యాణ్‌తో నేను మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్ ప్రకారమే మేము వేదిక మీద మాట్లాడుకోలేదు. దాన్నే మీడియా హైలెట్ చేసింది. పవన్ కళ్యాణ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. వారిని సర్‌ప్రైజ్ చేయడం కోసమే నేను ట్వి్ట్టర్‌లో ఆయన వీడియో పోస్ట్ చేశాను. నాన్నతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారనేది నాన్నని అడగండి’’ అని విష్ణు అన్నారు. 

విష్ణుకు థాంక్స్.. ప్రకాష్ రాజ్: ‘‘ఎన్నికల నిర్వహణపై మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే నేను సీసీటీవీ ఫూటేజ్ కావాలని కోరాను. స్కూల్ సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోలను పరిశీలించాను. ఇవి కాకుండా ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు సీసీటీవీ వీడియోలు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని కోరగా.. ఆయన స్పందించడం లేదు. కేవలం మీడియాతోనే మాట్లాడుతున్నారు. సీసీటీవీ వీడియోలు పరిశీలించేందుకు అనుమతి ఇచ్చిన విష్ణుకు థాంక్స్. నాకు విష్ణుతో సమస్య లేదు. కేవలం ఈసీతోనే. మరో వారం తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడతాం’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. 

Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు

Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
Tirumala: 2025 మే 11 నుంచి 19 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
2025 మే 11 నుంచి 19 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Embed widget