అన్వేషించండి

Lata Mageshkar: 'ప్యార్ కియాతో డర్నా క్యా' మెలోడీ క్వీన్ గొంతు మూగబోయింది

భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్(92) ఈరోజు కన్నుమూశారు. 

భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్(92) ఈరోజు కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. మెలోడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీ సంగీత దర్శకుడు ఆమెతో పాటలు పాడించుకోవాలని కోరుకునేవారు. 

తన కెరీర్ లో దాదాపు ఇరవై భాషల్లో వేల పాటలు పాడారామె. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కూడా ఈమె కొన్ని పాటలు పాడారు. 1955లో  ఏఎన్నార్ హీరోగా రూపొందిన 'సంతానం' చిత్రంలో ల‌తా మంగేష్క‌ర్ తొలిసారి తెలుగు పాట పాడారు. ఆ త‌రువాత నాగార్జున హీరోగా నటించిన 'ఆఖ‌రిపోరాటం'లో పాడారు. 

లతా మంగేష్కర్ సినీ ప్రయాణం..

లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు.1929 సెప్టెంబరు 28న జన్మించిన లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు లతా మంగేష్కర్. నిజానికి ఆమె అసలు పేరు హేమ. కానీ తన తండ్రి నటించిన 'భవ బంధన్' అనే నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటినుంచి ఆమె పేరు లతగా మారిపోయింది. ఐదేళ్ల వయసు నుంచే లతా నాటకాల్లో నటించడం, పాటలు పాడడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన ఆమె ఎక్కువ కాలం ముంబైలోనే గడిపారు. 

తన పదమూడేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది లతా. ఆ సమయంలో కుటుంబ పోషణ బాధ్యత లతాపై పడింది. దీంతో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించింది. 1942లో మరాఠీ సినిమా 'కిటి హసల్' సినిమాలో లతా మొదటి పాట పాడారు. అయితే సినిమాలో ఆ పాటను కట్ చేశారు. దీంతో ఆ పాట ఎప్పటికీ రిలీజ్ కాలేదు. ఆ తరువాత హిందీ సినిమాలో పాటలు పాడే అవకాశం దక్కించుకున్నారు. 'మహాల్' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

'ఆగ్', 'శ్రీ 420', 'చోరి చోరి', 'హైవే నెంబర్ 44', 'దేవదాస్' వంటి సినిమాలు లతా క్రేజ్ ను పెంచేశాయి. 1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన 'మొఘల్-ఏ-ఆజమ్' సినిమాలో పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' అనే పాట లతా మంగేష్కర్ స్థాయిని మరింత పెంచింది. 1990లో లతా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. తన ప్రొడక్షన్ లో గుల్జార్ దర్శకత్వంలో 'లేఖిని' అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో ఆమె పడిన పాటకు నేషనల్ అవార్డు దక్కింది. 

జనవరి 27, 1963లో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన 'ఏ మేరే వతన్ కే లోగాన్' అనే దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాటను 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 29th:దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget