అన్వేషించండి

Lata Mageshkar: 'ప్యార్ కియాతో డర్నా క్యా' మెలోడీ క్వీన్ గొంతు మూగబోయింది

భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్(92) ఈరోజు కన్నుమూశారు. 

భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్(92) ఈరోజు కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. మెలోడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీ సంగీత దర్శకుడు ఆమెతో పాటలు పాడించుకోవాలని కోరుకునేవారు. 

తన కెరీర్ లో దాదాపు ఇరవై భాషల్లో వేల పాటలు పాడారామె. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కూడా ఈమె కొన్ని పాటలు పాడారు. 1955లో  ఏఎన్నార్ హీరోగా రూపొందిన 'సంతానం' చిత్రంలో ల‌తా మంగేష్క‌ర్ తొలిసారి తెలుగు పాట పాడారు. ఆ త‌రువాత నాగార్జున హీరోగా నటించిన 'ఆఖ‌రిపోరాటం'లో పాడారు. 

లతా మంగేష్కర్ సినీ ప్రయాణం..

లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు.1929 సెప్టెంబరు 28న జన్మించిన లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు లతా మంగేష్కర్. నిజానికి ఆమె అసలు పేరు హేమ. కానీ తన తండ్రి నటించిన 'భవ బంధన్' అనే నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటినుంచి ఆమె పేరు లతగా మారిపోయింది. ఐదేళ్ల వయసు నుంచే లతా నాటకాల్లో నటించడం, పాటలు పాడడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన ఆమె ఎక్కువ కాలం ముంబైలోనే గడిపారు. 

తన పదమూడేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది లతా. ఆ సమయంలో కుటుంబ పోషణ బాధ్యత లతాపై పడింది. దీంతో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించింది. 1942లో మరాఠీ సినిమా 'కిటి హసల్' సినిమాలో లతా మొదటి పాట పాడారు. అయితే సినిమాలో ఆ పాటను కట్ చేశారు. దీంతో ఆ పాట ఎప్పటికీ రిలీజ్ కాలేదు. ఆ తరువాత హిందీ సినిమాలో పాటలు పాడే అవకాశం దక్కించుకున్నారు. 'మహాల్' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

'ఆగ్', 'శ్రీ 420', 'చోరి చోరి', 'హైవే నెంబర్ 44', 'దేవదాస్' వంటి సినిమాలు లతా క్రేజ్ ను పెంచేశాయి. 1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన 'మొఘల్-ఏ-ఆజమ్' సినిమాలో పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' అనే పాట లతా మంగేష్కర్ స్థాయిని మరింత పెంచింది. 1990లో లతా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. తన ప్రొడక్షన్ లో గుల్జార్ దర్శకత్వంలో 'లేఖిని' అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో ఆమె పడిన పాటకు నేషనల్ అవార్డు దక్కింది. 

జనవరి 27, 1963లో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన 'ఏ మేరే వతన్ కే లోగాన్' అనే దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాటను 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం

వీడియోలు

Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Samantha Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Embed widget