అన్వేషించండి

Unstoppable Season 3: 'అన్ స్టాపబుల్‘ షోలో ‘యానిమల్’ టీమ్ సందడి, ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Unstoppable Season 3: నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్’ టాక్ షోలో ‘యానిమల్’ టీమ్ సందడి చేయబోతున్నది. తాజాగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ను ‘ఆహా’ అనౌన్స్ చేసింది.

Unstoppable Talk Show: తెలుగు రాష్ట్రాల్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న టాక్ షోలలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నది. సెలబ్రిటీలతో బాలయ్య చేసే సందడి ఫ్యాన్స్ ను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు ఈ షోలో పాల్గొనడంతో మరింత క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ షో మూడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్ తో బాలయ్య సందడి చేశారు. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మొదలైన ఈ సీజన్ లో ఇప్పడు ‘యానిమల్’ టీమ్ సందడి చేయబోతున్నది. ఈ షోలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పాల్గొంటున్నారు.

నవంబర్ 24న ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్

తాజాగా ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 24న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ‘యానిమల్’ టీమ్ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. 'యానిమల్'  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక మందన, డైరెక్టర్ సందీప్ వంగా 'అన్ స్టాపబుల్ సీజన్ 3' లో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో రణబీర్, బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని  ఆకట్టుకుంది. మొట్టమొదటిసారి ఓ బాలీవుడ్ హీరో బాలయ్య షోలో సందడి చేయడంతో ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోలో రణబీర్ కపూర్ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్  "ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు" అనే డైలాగ్ చెప్పి అలరించినట్లు తెలుస్తోంది.     

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న రణబీర్

అటు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగ హిందీలో తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో రణబీర్ గతంలో ఎన్నడూ లేనంత మాస్ గా చూపించబోతున్నారు దర్శకుడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ‘బ్రహ్మాస్త’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రణబీర్, ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి భావిస్తున్నారు. ఈ మూవీలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.   

Read Also: గ్లామర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, నటి శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
AK 47 Release Date: గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget