అన్వేషించండి

Drishyam-3: థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. త్వరలో సెట్స్ మీదకు దృశ్యం-3

సస్పెన్స్ థ్రిల్లర్స్ కు మరో గుడ్ న్యూస్.. ‘దృశ్యం-3’ సినిమా రాబోతున్నట్లు నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రకటించారు.

మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్‌, ప్రముఖ నటి మీనా జంటగా తెరకెక్కిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. అంతే కాదు.. ఈ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా అద్భుత విజయాలను అందుకున్నాయి. దృశ్యం-2 తర్వాత కొనసాగింపు ఉండదని సినీ అభిమానులు భావించారు. కానీ తాజాగా క్రేజీ న్యూస్ చెప్పారు ఈ సినిమా దర్శక నిర్మాతలు. ఈ సిరీస్‌లో మూడో సినిమాపై కొద్ది రోజులగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. తాజాగా జరిగిన ఓ సినీ వేడుకలో ‘దృశ్యం-3’ సినిమా రాబోతున్నట్లు నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రకటించారు. ప్రేక్షకుల్ల మరింత ఆసక్తిని రేకెత్తించారు.  

అద్భుత విజయాన్ని అందుకున్న దృశ్యం

వాస్తవానికి.. విజయం సాధించిన సినిమాకు సీక్వెట్ మూవీ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో వచ్చే సినిమా మీద జనాల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అందుకే సీక్వెల్‌గా వచ్చిన చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. కొన్ని సినిమాల మాత్రమే ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. అవే మరోసారి హిట్ కొడతాయి. అలాంటి సినిమాల లిస్టులో చేరుతుంది ‘దృశ్యం’ సినిమా. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో మోహన్ లాల్ హీరోగా మీనా హీరోయిన్‌గా జీతూ జోసెఫ్ దర్శకత్వం మలయాళంలో ఈ సినిమా తెరకెక్కింది. మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టును కలిగి ఉన్న ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అయ్యింది. అన్ని చోట్లా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

తొలి సినిమాను మించి విజయం సాధించిన దృశ్యం-2  

దృశ్యం సూపర్ హిట్ కావడంతో.. సీక్వెల్‌గా దృశ్యం-2 సినిమా తీశారు. ఈ సినిమా తొలి చిత్రంతో పోల్చితే మరితం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రేక్షకులు ఈ సినిమాకు సైతం బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. తొలి సినిమా మాదిరిగానే ఇది కూడా చాలా సినిమాల్లోకి రీమేక్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది.  అయితే రెండో భాగంలో సినిమా కథ ముగింపు పలికినట్లుగానే చూపించారు దర్శకుడు. ప్రేక్షకులు సైతం మరో సినిమా ఉండదనే భావించారు. కానీ కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్ లో మరో సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపించింది. అనుకున్నట్లుగానే దర్శక నిర్మాతలు మరో పార్ట్ తీయబోతున్నట్లు ప్రకటించారు. సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచారు.  

త్వరలో సెట్స్ మీదకు దృశ్యం-3

సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకి మరో సీక్వెల్ ప్రకటించడం, ఈ సినిమాకు కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనుండటంతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ -3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. అటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మూడో భాగంలో దర్శకుడు ఎన్ని ట్విస్టులు ఇస్తాడో? ఏమో? అని సినీజనాల్లో చర్చ జరుగుతున్నది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rakasa Teaser : ఊరికి ఉన్న శాపం వెనుక రహస్యం ఏంటి? - నవ్విస్తూనే భయపెట్టేశారు... ఇంట్రెస్టింగ్‌గా రాకాస టీజర్
ఊరికి ఉన్న శాపం వెనుక రహస్యం ఏంటి? - నవ్విస్తూనే భయపెట్టేశారు... ఇంట్రెస్టింగ్‌గా రాకాస టీజర్
Vijay Deverakonda Rashmika : టీటీడీ టెంపుల్ దర్శించిన విరోష్ కపుల్ - ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన కొత్త జంట
టీటీడీ టెంపుల్ దర్శించిన విరోష్ కపుల్ - ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన కొత్త జంట
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మిక పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ - రణబాలి దర్శకుడు ఏం చెప్పారంటే?
విజయ్ రష్మిక పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ - రణబాలి దర్శకుడు ఏం చెప్పారంటే?
US Israel Strikes On Iran: అబుదాబిలో చిక్కుకున్న 'వినయ విధేయ రామ' ఐటమ్ గర్ల్... ఇరాన్‌పై అమెరికా & ఇజ్రాయెల్ ఎటాక్ ఎఫెక్ట్
అబుదాబిలో చిక్కుకున్న 'వినయ విధేయ రామ' ఐటమ్ గర్ల్... ఇరాన్‌పై అమెరికా & ఇజ్రాయెల్ ఎటాక్ ఎఫెక్ట్

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget