అన్వేషించండి

ఓటీటీ లోకి వచ్చేసిన 'విమానం' - ఎక్కడ చూడొచ్చంటే!

తమిళ నటుడు సముద్రఖని అనసూయ భరద్వాజ్ రాహుల్ రామకృష్ణ ధన్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విమానం' చిత్రం తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది.

కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'విమానం'. శివప్రసాద్ యానాల రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  జూన్ 9 న థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాత కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని నిర్మించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరాజాస్మిన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. జూన్ 30న (నేడు) ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ ZEE5 తాజాగా ఓ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసింది. కాగా థియేటర్స్ లో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని కాస్త ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేసేసారు మేకర్స్. సాధారణంగా థియేటర్లో విడుదలైన 30 నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీ లో సినిమాని రిలీజ్ చేయాలి. కానీ 'విమానం' సినిమా మాత్రం కాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాని థియేటర్స్ లో మిస్సయిన ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ZEE5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.

ఇక 'విమానం' కథ విషయానికి వస్తే.. వికలాంగుడైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వీరయ్య(సముద్ర ఖని) భార్య మరణించడంతో తన కొడుకు రాజు (మాస్టర్ ధృవన్)తో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటాడు. ఆటో స్టాండ్ వద్ద, మరుగుదొడ్ల నిర్వహణతో వచ్చే చాలీచాలని సంపాదనే అతని కుటుంబానికి ఆధారం. ఇక బడికి వెళ్లే వీరయ్య(సముద్ర ఖని) కొడుకు రాజు(మాస్టర్ ధ్రువన్)కి విమానం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక పైలెట్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే రాజు పెద్దయ్యే వరకు కాకుండా నెల రోజుల్లో విమానం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాంతో తన కొడుకు కోరికను నెరవేర్చేందుకు తండ్రి వీరయ్య ఏం చేశాడు? రాజుకి అంత తొందరగా విమానం ఎక్కించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అందుకోసం వీరయ్య ఏం చేశాడు? ఇక ఆ బస్తీలోనే ఉండే సుమతి(అనసూయ భరద్వాజ్), కోటి(రాహుల్ రామకృష్ణ), డానియల్(ధన్ రాజ్) జీవితాల వెనుక ఉన్న కధ ఏమిటి? వీరయ్యకి వాళ్ళు ఎలా సాయం చేశారు? అనేది ఈ సినిమా కథ.

కాగా ఒకవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే దర్శకుడిగా కూడా బిజీ అవుతున్నాడు సముద్రఖని. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'బ్రో' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget