Manchu Manoj : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
Manchu Manoj Reaction : రాకింగ్ మంచు మనోజ్ జిమ్ వర్కౌట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డేవిడ్ రెడ్డి' లుక్ కోసం ఆయన ఎంత శ్రమిస్తున్నారో పోస్ట్ చేశారు.

Manchu Manoj About His Workouts For David Reddy Movie : రీసెంట్గా మిరాయ్లో 'మహావీర్ లామా'గా అలరించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్, కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన తాజాగా... 'డేవిడ్ రెడ్డి'లో మరో వైవిధ్యమైన రోల్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీని కోసం చాలా శ్రమిస్తున్నారు.
రాబోయే సినిమాల కోసం గత 3 వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నట్లు తాజాగా ఇన్ స్టా పోస్ట్ పెట్టారు. మంచు మనోజ్ వర్కౌట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడిగా ఆయన చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఈ పోస్ట్లో తాను తీసుకున్న డెసిషన్ గురించి వివరించారు మనోజ్.
'కెమెరా అబద్ధం చెప్పదు'
సౌకర్యంగా ఉండేందుకు సాకులు వెతక్కుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. '3 వారాల క్రితం ఓ డెసిషన్ తీసుకున్నా. ఇక సౌకర్యంతో రాజీ పడడం లేదు. సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. కేవలం కష్టం మాత్రమే. యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేదు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవడం.
ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇకపై కేవలం లుక్ కోసం మాత్రమే కాకుండా... శక్తి, సహనాన్ని పెంచుకోవడంపై నేను దృష్టి పెట్టాను. దృఢమైన వ్యక్తిలా తయారవడం నా లక్ష్యం. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కేవలం 21 రోజుల్లోనే నేను కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : శ్రీరామనవమికి 'సుయోధన'... సాయి కుమార్, ప్రియదర్శిల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
'మిరాయ్' సినిమాతో మంచు మనోజ్ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. పవర్ ఫుల్ విలన్ రోల్లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. తన పాత్రల్లో ఆయన చూపించిన శారీరక శక్తి, భావోద్వేగ నిబద్ధత మరోసారి ఈ సినిమాతో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డేవిడ్ రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ హీరోయిన్ మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్కు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో మనోజ్ న్యూ అవతార్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డేవిడ్ రెడ్డి తర్వాత ఇతర ప్రాజెక్టుల్లోనూ ఆయన బిజీగా ఉన్నారు. త్వరలోనే వీటి అప్డేట్స్ రానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
























