Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Anupama Reaction : రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వార్తలు, ఇన్ స్టా పోస్టులు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా క్రేజీ కల్యాణం టీజర్ ఈవెంట్లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran Reaction About Her Insta Posts : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్గా లవ్ బ్రేకప్ రూమర్స్తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె చేసిన ఇన్ స్టా పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె క్రేజీ కల్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తన ఇన్ స్టా పోస్టులపై ఆమె రియాక్ట్ అయ్యారు.
'అది నా ఇష్టం'
తాను ఓ కష్టమైన సంవత్సరాన్ని గడిపానని.. ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్లు చెప్పారు అనుపమ. 'ప్రస్తుతం నేను అద్భుతంగా ఉన్నా. నేను ఓ కష్టమైన సంవత్సరాన్ని గడిపాను. కానీ ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నాను. నేను ఈ స్థితికి ఇంకొంచెం ముందుగానే చేరుకుని ఉంటే బాగుండేదని మాత్రమే కోరుకుంటున్నా.' అని చెప్పారు.
'తన గతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అవసరమా?' అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... 'అది నా సోషల్ మీడియా. ఏది పోస్ట్ చేయాలో చేయకూడదో నేను నిర్ణయించుకుంటాను. ఏమైనా నేను పోస్ట్ చేసుకుంటాను. దాని గురించి అడిగే రైట్ ఎవరికీ లేదు. నా గురించి ఎవరికి ఏం తెలుసు.' అని తెలిపారు.
'ఆ హీరోతో బ్రేకప్'
కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్తో అనుపమ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. బైసన్ మూవీ చేస్తున్న టైంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే టాక్ వినిపించింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్లో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో ఆ రూమర్స్కు మరింత ఆజ్యం పోసినట్లయింది. కొన్ని రోజుల తర్వాత అనుపమ రీసెంట్గా ఇన్ స్టాలో చేసిన పోస్టులు ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా? అనే ఊహాగానాలకు తెర తీసినట్లయింది.
'నాకు ఫ్రీడమ్ వచ్చింది. కొన్నిసార్లు మనశ్శాంతి పొందాలంటే మీరు నిస్సహాయమైన మార్గాలు వదిలేయాల్సిందే. ఈ రోజు నుంచి నా గొంతు నా లైఫ్ నేనే ఎంచుకుంటాను. ఇకపై అనుమతులు అక్కర్లేదు. భయం లేదు. నాది అని మర్చిపోయిన జీవితంలో ప్రేమలో పడుతున్నాను. ఇది స్వేచ్ఛకు స్వాగతం, నా జీవితానికి స్వాగతం.' అంటూ ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. తాజాగా అనుపమ రియాక్షన్తో అది కన్ఫర్మ్ అయినట్లేనని ఫ్యాన్స్, నెటిజన్స్ అంటున్నారు.
'క్రేజీ కల్యాణం' మూవీ విషయానికొస్తే... తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన విలేజ్ కామెడీ ఎంటర్టైనర్. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తుండగా... అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా అనుపమ లుక్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి చుట్టూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ను బట్టి తెలుస్తోంది.
Also Read : Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ వార్తలు























