By: ABP Desam | Updated at : 26 Apr 2023 11:29 AM (IST)
Photo Credit: Madhavi Latha/Instagram
అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఓ కన్నడ బ్యూటీ ‘అతిథి’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అందం, అభినయంతో అలరించింది. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. సినిమాల కంటే ‘మీ టూ’ లాంటి వివాదాస్పద అంశాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె ఎవరో మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది. అవును. తనే మాధవీ లత.
తాజాగా ఆమె ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది తను డిగ్రీలో ఉండగా తీసుకున్న దిగిన ఫోటో. “డిగ్రీ ఫైనల్ ఇయర్ లో హంపీ హిస్టరీ రిపోర్టుకు సంబంధించి సైట్ విజిట్ చేశాం. రాయల వారి హంపీ సామ్రాజ్యం అంతా తిరిగి తిరిగి పాయింట్స్ అన్ని రాసుకుని, ఎండకు ఎండి, ముఖాలు వాడిపోయి ఉన్నా, ఒక ఫోటో దిగాం. ఏది ఏమైనా అవి చాలా సంతోషకరమైన రోజులు. నేను ఎక్కడున్నానో గెస్ చేయండి” అంటూ మాధవీ లత రాసుకొచ్చింది.
View this post on InstagramA post shared by MadhaviLatha ll orator ll sanathani ll BJP Women ll (@actressmaadhavi)
‘అతిథి’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ
మాధవీ లత సినిమా పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2007లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఇందులో హీరోయిన్ అమృతా రావు ఫ్రెండ్ గా కనిపించింది. 2008లో రవిబాబు దర్శకత్వం వహించిన ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత నానితో కలిసి ‘స్నేహితుడా’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ చదువుకుంది. 2013లో ‘అరవింద్ 2’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దివంగత నందమూరి తారకరత్నతో కలిసి ‘చూడాలని చెప్పాలని’ సినిమాలో నటించింది. ఇందులో మూగ, చెవిటి అమ్మాయిలా కనిపించింది. అయితే, ఈ సినిమా కొన్ని కారణాలతో రిలీజ్ కాలేదు. పలు సినిమాల్లో నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. సినిమా పరిశ్రమలో ‘కమిట్మెంట్‘ వార్తలతో కొంత కాలం మీడియాలో బాగా పాపురల్ అయ్యింది.
రాజకీయాల్లో బిజీ అయిన మాధవి
ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. రాజకీయాల్లో బిజీ అయ్యింది. 2018లో బీజేపీలో చేరింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో తను ఓటమి పాలయ్యింది. మాధవీ లత కర్ణాటక లోని బళ్ళారిలో 1988, అక్టోబరు 2న జన్మించింది. బళ్ళారిలో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకుంది. కన్నడ ఫ్యామిలీలో పుట్టినా, తెలుగు, తమిళ భాషలు చక్కగా మాట్లాడుతుంది.
View this post on InstagramA post shared by MadhaviLatha ll orator ll sanathani ll BJP Women ll (@actressmaadhavi)
Read Also: అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు