NTR : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
NTR New Look : బెంగుళూరు కిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రావడంతో సందడి నెలకొంది. కన్నడిగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

NTR New Look Gone Viral : హిస్టారికల్ మూమెంట్ రిపీట్ అయ్యింది. తన తాత ఎన్టీఆర్... ఏపీ సీఎం హోదాలో భూమి పూజ చేసిన ఆస్పత్రి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెళ్లారు. బెంగుళూరు కిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి శనివారం తారక్ వెళ్లడంతో సందడి వాతావరణం నెలకొంది. అప్పటి జ్ఞాపకాలను ఎన్టీఆర్తో పాటు హాస్పిటల్ యాజమాన్యం గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పబ్లిక్లోకి ఎన్టీఆర్
చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్లోకి రావడంతో జోష్ మామూలుగా లేదు. గుబురు గెడ్డంతో గ్యాంగ్ స్టర్గా ఆయన స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏ ఈవెంట్లోనూ కనిపించలేదు. తాజాగా న్యూ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
😀 @tarak9999 pic.twitter.com/aBJkOOFCA4
— .... (@ynakg2) March 8, 2026
. @tarak9999 pic.twitter.com/mfGy3mosCr
— .... (@ynakg2) March 8, 2026
Also Read : ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...
కన్నడిగుల ఘన స్వాగతం
ఎన్టీఆర్కు కన్నడిగులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో నగరమంతా సందడి నెలకొంది. ఎయిర్ పోర్ట్, బెంగుళూరు సెంటర్స్, ఆస్పత్రి ఇలా ఎక్కడ చూసినా ఫ్యాన్స్ పోటెత్తారు. అందరికీ కారులో అభివాదం చేస్తూ ఆయనకు ముందుకు సాగారు. మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా బ్లాక్ అయ్యాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఒక్కసారిగా ఫ్యాన్స్ రోడ్లపైకి రావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ అభివాదం చేశారు. కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆయనపైకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... సింహాద్రి సీన్ రిపీట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ciniema Aiyna Real Nikosam Matram eppudu ilaney vastam Anna @tarak9999#NTRInBanglore #JrNTR pic.twitter.com/04oJtP2Fj8
— 𝑺𝒉𝒊𝒗𝒂 𝑻𝒂𝒓𝒂𝒌 18🐉 (@SK_Kohli_18) March 8, 2026
CM NTR CM NTR slogans at KIMS Hospital Bangalore #JrNTR pic.twitter.com/ZgOJDrk7em
— 𝑺𝒉𝒊𝒗𝒂 𝑻𝒂𝒓𝒂𝒌 18🐉 (@SK_Kohli_18) March 8, 2026
Visuals : #JrNTR at Bangalore.
— IndiaGlitz Telugu™ (@igtelugu) March 8, 2026
pic.twitter.com/LhK14JAtll
ప్రస్తుతం ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా జోర్డాన్లో షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన లాస్ట్గా 'వార్ 2'లో నటించారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న 'డ్రాగన్' కోసం ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు
























