అన్వేషించండి

Telangana Congress : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు - కానీ అధికారిక ప్రకటన ఏది ?

Khammam Lok Sabha : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ దాఖలు చేశారు. కానీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Telangana Politics :  కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తూండటంతో   రామ సహాయం రఘురాంరెడ్డి అనే నేత అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఫాం మాత్రం ఇంకా ఆయన చేతికి అందలేదు.  రఘురాంరెడ్డికి  టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్  వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ నుంచి  వెలిచాల రాజేందర్ రావు కూడా నామినేషన్ వేశారు. ఆయన పేరునూ ప్రకటించాల్సి ఉంది. 

మంత్రి పొంగులేటికి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడుగా చెబుతున్నారు. ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన తరపున  పొంగులేటి అనుచరులే నామినేషన్లు దాఖలు చేశారు.  ఖమ్మంలోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్కెట్ తమ వారికి ఇవ్వాలంటే తమ వారికి ఇవ్వాలని పలువురు నేతలు పోటీ పడ్డారు.  తమ వారికి ఇప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించారు. పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినా చివరి క్షణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.                                 

భట్టి  విక్రమార్క తన భార్యకు కాకపోతే రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రాయల నాగేశ్వరరావు పేర్లను పరిగణలోకి తీసుకుని  వీరిలో ఒకరి పేరును ప్రకటించాలని డిసైడయింది. చివరికి  పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురాంరెడ్డికే టికెట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయన తరుపున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన బుధవారం  అధిష్టానం అధికారికంగా  చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత కల్పించలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ సామాజిక వర్గం వ్యక్తికి అధిష్టానం అవకాశం ఇస్తుందని భావించారు. కానీ, ఖమ్మం నుంచికూడా అవకాశం లేదని తెలుస్తోంది.                                         

మామూలుగా ఆ సీటు నుంచి  రేణుకాచౌదరి పోటీ చేసేవారు. ఆమెకు రాజ్యసభ  సీటు ఇవ్వడంతో రేసు నుంచి తప్పుకున్నట్లయింది. కానీ తీవ్ర పోటీ మధ్య అభ్యర్థిని ఖరారు చేయలేకపోయారు. చివరికి డీకే శివకుమార్  రంగంలోకి దిగి .. సీనియర్ నేతలతో చర్చలు జరిపి.. పొంగులేటి కోటాలోనే ఖరారు చేశారు. దీనిపై ఇతర మంత్రులు ఇద్దరూ అసంతృప్తి చెందినా ఇప్పటికి కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.                           
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget