అన్వేషించండి

TS SET 2022: టీఎస్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా!

డిసెంబరు 30 నుంచి టీఎస్ సెట్ 2022 ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

టీఎస్ సెట్-2022 (TS SET-2022)

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష (టీఎస్ సెట్) ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు..

➥ TS-SET-2022 నోటిఫికేషన్ (ప్రెస్‌నోట్): 23-12-2022.

➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30-12-2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఆలస్యరుసుము లేకుండా): 20-01-2023. 

➥ రూ.1500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25-01-2023.

➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 31-01-2023.

➥ రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది:  05-02-2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 2023, ఫిబ్రవరి 6, 7 తేదీల్లో.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 2023, ఫిబ్రవరి చివరివారంలో. 

➥ పరీక్ష తేది: 2023, మార్చి మొదటి లేదా రెండోవారంలో. 

Notification
Website 

Also Read:

టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్  ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023 నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌  పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dalit leaders oppose Jagan: అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
NTR Health Scheme : ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారు - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారు - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
Tilak Varma | తిలక్ వర్మకి మళ్లీ కెప్టెన్సీ అప్పగించిన హెచ్‌సీఏ
Rohit Sharma diet Plan । 95 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గిన రోహిత్ శర్మ డైట్ సీక్రెట్ ఇదే
TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit leaders oppose Jagan: అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
NTR Health Scheme : ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారు - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారు - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
India UK Trade Deal:భారత్‌- బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం- మరిన్ని ఉద్యోగాలకు కొత్త మార్గాలు! 
భారత్‌- బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం- మరిన్ని ఉద్యోగాలకు కొత్త మార్గాలు! 
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
BRS Leaders : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్‌కు డి కంపెనీ పేరుతో ధమ్కీ- రూ.5 కోట్లు డిమాండ్‌
క్రికెటర్ రింకూ సింగ్‌కు డి కంపెనీ పేరుతో ధమ్కీ- రూ.5 కోట్లు డిమాండ్‌
Embed widget