మద్యం కుంభకోణం కేసులో ఏడో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి. అతను పోలీసులకు దొరకకుండా ఏడాది కాలంగా తప్పించుకుంటున్నాడు.
Andhra Pradesh Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి...
Andhra Pradesh Liquor Scam Case: ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించడంతో లిక్కర్ స్కామ్లో అవినాశ్ రెడ్డి లొంగిపోయారు.

Andhra Pradesh Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది కాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏడో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, ఎట్టకేలకు మంగళవారం విజయవాడలోని సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక లొంగిపోవడం తప్ప మరో మార్గం లేక ఆయన తన న్యాయవాదితో కలిసి అధికారుల ముందుకు వచ్చారు.
ఏడాది కాలంగా విదేశాల్లోనే...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నమోదైనప్పటికీ నుంచి ముప్పిడి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయన సోదరుడు అరెస్ట్అయిన తర్వాత తనను కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. గతేడాది నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై అధికారులు లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.
తొలుత బెయిల్ కోసం అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జనవరి 29న హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అవినాష్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆయన ఫిబ్రవరి 26న శ్రీలంక నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అప్పటి వరకు అరెస్టు చేయకుండా లుక్ అవుట్ సర్క్యూలర్ను నిలిపివేయాలని కోరారు. అయితే దీనిపై సీజేఐ సూర్యాకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా నిందితుడు పరారీలోనే ఉన్నాడు కదా? అసలు ఏ కోర్టు అనుమతి తీసుకొని ఆయన విదేశాలకు వెళ్లారు? అని సూటిగా ప్రశ్నించింది.
చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించే వ్యక్తులకు ముందస్తు బెయిల్ ఇచ్చి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది ముందు ఆయన లొంగిపోవాలి, ఆ తర్వాతే రెగ్యులర్బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ పిటిషన్లు పరిశీలిస్తామని చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.
విజయవాడ సిట్ కార్యాలయంలో లొంగుబాటు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన ముప్పిడి అవినాష్ మంగళవారం సాయంత్రమే విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాదితో కలిసి వచ్చి అధికారుల ఎదుట సరెండ్ అయ్యారు. ఏడాది కాలంగా సాగుతున్న ఈ దాగుడుమూతల పర్వానికి ఇక్కడితో తెరపడింది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అవినాష్ రెడ్డి లొంగుబాటుతో ఈ దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Frequently Asked Questions
మద్యం కుంభకోణం కేసులో ఏడో నిందితుడు ఎవరు?
ముప్పిడి అవినాష్ రెడ్డి ఎందుకు లొంగిపోయారు?
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేక అధికారుల ముందు లొంగిపోయారు.
ముప్పిడి అవినాష్ రెడ్డి ఎంతకాలం పరారీలో ఉన్నారు?
ముప్పిడి అవినాష్ రెడ్డి కేసు నమోదైనప్పటి నుండి ఏడాది కాలంగా పరారీలో ఉన్నారు. అతను దేశం విడిచి విదేశాలకు పారిపోయారు.
ముప్పిడి అవినాష్ రెడ్డి బెయిల్ కోసం ఎక్కడ ప్రయత్నించారు?
ముప్పిడి అవినాష్ రెడ్డి మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు, కానీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.























