అన్వేషించండి

JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వచ్చే ఏడాది జూన్‌ 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 30న రిజిస్ట్రేషన్‌ ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. అభ్యర్థులు మే 5వ తేదీలో ఫీజు చెల్లించాలి.

ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023 నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వచ్చే ఏడాది జూన్‌ 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 30 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.  విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 వరకు వెసులుబాటు కల్పించింది. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. విదేశాల్లో ఉన్న విద్యార్థులైతే ఏప్రిల్ 24 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఐఐటీ గువాహటి పేర్కొంది. 

వివరాలు..

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023

అర్హత: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్‌ ఉండాలి. కనీసం 75 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 65 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2023 పేపర్ - 1 రాసినవారే అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు.

వయోపరిమితి: 1998 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే 1993 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

ఫీజు వివరాలు...
పరీక్ష ఫీజుగా రూ.2900 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1450 చెల్లిస్తే సరిపోతుంది. విదేశీ విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 90 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 180 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.    

పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2023.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2023.

➥ విదేశీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.

➥ విదేశీ విద్యార్థుల దరఖాస్తుకు చివరితేది: 04.05.2023.

➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 29.05.2023 నుంచి 04.06.2023 వరకు 

➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 04.06.2023.

JEE Advanced 2023 Notification

Information for foreign national candidates

Also Read:

జేఈఈ మెయిన్‌-2023 పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది. ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్ష విధానం, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave: చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు
చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు
ABP Desam SmartEd Conclave 2026: హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!
హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!
AP Intermediate Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌! మారిన రూల్స్ తెలుసుకోకుంటే పరీక్ష రాయలేరు! 
ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌! మారిన రూల్స్ తెలుసుకోకుంటే పరీక్ష రాయలేరు! 
Fake universities: ఏపీలో ఉన్న ఈ రెండు ఫేక్ యూనివర్శిటీలు - యూజీసీ కీలక ప్రకటన
ఏపీలో ఉన్న ఈ రెండు ఫేక్ యూనివర్శిటీలు - యూజీసీ కీలక ప్రకటన

వీడియోలు

Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
Abhishek Sharma Dropped T20 World Cup | టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు | ABP Desam
David Miller India vs South Africa T20WC | టీమిండియా ఓటమికి మిల్లర్ ప్లాన్ ఇదే | ABP Desam
Sunil Gavaskar Slams Abhishek Sharma | అభిషేక్ శర్మపై గవాస్కర్ ఫైర్ | ABP Desam
Zimbabwe vs West Indies T20 World Cup | వాంఖడేలో వెస్టిండీస్ విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India 2026: ఉత్తమ చర్చలు, సాహసోపేతమైన ఆలోచనలు సమాజంపై గొప్ప ప్రభావం చూపిస్తాయి - ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌పై నారా లోకేష్ ట్వీట్
ఉత్తమ చర్చలు, సాహసోపేతమైన ఆలోచనలు సమాజంపై గొప్ప ప్రభావం చూపిస్తాయి - ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌పై నారా లోకేష్ ట్వీట్
El Mencho girlfriend : మెక్సికో డ్రగ్ మాఫియా డాన్‌ను పట్టించింది గర్ల్ ఫ్రెండే - ఎల్ మాంచో వేటలో ధ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ను మించిన ట్విస్టులు
మెక్సికో డ్రగ్ మాఫియా డాన్‌ను పట్టించింది గర్ల్ ఫ్రెండే - ఎల్ మాంచో వేటలో ధ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ను మించిన ట్విస్టులు
Odisha Vigilance apprehended Debabrata Mohanty: అయ్యగారు 30వేలు లంచం తీసుకుంటూ దొరికారు - సోదాలు చేస్తే ఓ మినీట్రక్కు పట్టేంత కట్టలు దొరికాయి ! వీడియో
అయ్యగారు 30వేలు లంచం తీసుకుంటూ దొరికారు - సోదాలు చేస్తే ఓ మినీట్రక్కు పట్టేంత కట్టలు దొరికాయి ! వీడియో
NCERT Corruption in judiciary: న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పుస్తకంలో పాఠాలు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ సూర్యకాంత్
న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పుస్తకంలో పాఠాలు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ సూర్యకాంత్
YSRCP Politics: కల్తీ నెయ్యి కేసులో అసెంబ్లీలో టీడీపీకి వాకోవర్ ఇచ్చిన వైసీపీ - నష్టం అంచనా వేయలేనంత!
కల్తీ నెయ్యి కేసులో అసెంబ్లీలో టీడీపీకి వాకోవర్ ఇచ్చిన వైసీపీ - నష్టం అంచనా వేయలేనంత!
Youtuber Suicide: విశాఖకు చెందిన యూట్యూబర్ కోమలి సూసైడ్, లవర్‌తో బ్రేకప్ కారణమా!
విశాఖకు చెందిన యూట్యూబర్ కోమలి సూసైడ్, లవర్‌తో బ్రేకప్ కారణమా!
Rajamahendravaram Milk Adulteration: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. యూరియా కలపలేదు, మరణాలకు కారణం ఇదేనా!
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. యూరియా కలపలేదు, మరణాలకు కారణం ఇదేనా!
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!
కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!
Embed widget