అన్వేషించండి

TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు

తెలంగాణలో ఉన్న 7 వర్సిటీల పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు ఆగస్టు 25తో ముగియనుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7 వర్సిటీల పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2021) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 25వ తేదీతో ముగియనుంది.

ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30వ తేదీ వరకు.. రూ.2000తో సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సీపీజీఈటీ సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీజీఈటీ పరీక్షలను సెప్టెంబరు 8 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

దరఖాస్తు రుసుము ఒక్కో సబ్జెక్టుకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800గా ఉంది. అదనంగా మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.osmania.ac.in, http://www.tscpget.com/, http://ouadmissions.com/, http://www.tscpget.com/ వెబ్ సైట్లను సంప్రదించవచ్చు. 

Also Read: GATE 2022 Exam Date: గేట్ పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి కొత్తగా రెండు పేపర్లు..

ఏయే వర్సిటీల్లో చేరవచ్చు?
ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, జేఎన్టీయూ (జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌) యూనివర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. 

విద్యార్హత వివరాలు..
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ( బీఏ/ బీకామ్/ బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పైన పేర్కొన్న కోర్సుల్లో ఫైనలియర్ చదువుతోన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అయినటు వంటి ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏలకు ఇంటర్ పూర్తయిన వారు అర్హులు.

పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎల్ఎల్బీ (5 ఏళ్లు) పూర్తి చేసిన వారు తమ విద్యార్హతను ఆధారంగా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలు పొందాలనుకునే కోర్సును బట్టి విద్యార్హత మారుతోంది. కాబట్టి కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. 

ఏయే కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు?
సీపీజీఈటీ-2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ అండ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. 

పరీక్ష విధానం..
ఈ పరీక్షను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తన విద్యార్హతను బట్టి కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంది. 

Also Read: Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget