అన్వేషించండి

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అక్కడ ఏకంగా లక్షన్నరకు పెంపు!

ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది.

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ.45 వేలకు పెరిగింది. ఎంజీఐటీ కాలేజీలో రూ.1.60 లక్షలు, సీవీఆర్ లో రూ.1.50 లక్షకు చేరింది. సీబీఐటీ, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఉంది. ఇక ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ. 57 వేలుగా ఖరారు చేసింది. కాగా కొత్త ఇంజినీరింగ్ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

ఇంజినీరింగ్ ఫీజుల విషయమై సెప్టెంబ‌రు 24న విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ‌ఫీజులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలలు ఇందుకు అంగీకరించాయి. అయితే 20 కళాశాలలు మాత్రం ఈ ఫీజులను అంగీకరించలేదు. వీటిలో సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, అనురాగ్, విద్యాజ్యోతి, కేఎంఐటీ, మల్లారెడ్డి, సీఎంఆర్ గ్రూపుల్లోని మరికొన్ని కళాశాలలున్నాయి. దీంతో కమిటీ మరోసారి వారి అభ్యంతరాలను వినాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రతినిధులతో అక్టోబ‌రు 3న సుదీర్ఘంగా చర్చించింది. కళాశాలల విజ్ఞప్తులను, పత్రాలను పరిశీలించింది. అనంతరం ఆయా కళాశాలలు కొంత మొత్తాన్ని పెంచుకునేందుకు కమిటీ అంగీకరించింది. ఎట్టకేలకు 159 ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన ఫీజుల వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఎంజీఐటీ టాప్..
ఈసారి అత్యధిక ఫీజు ఎంజీఐటీకి రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా.. అత్యల్ప ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. ఇక సీబీఐటీకి పాత ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా, గత జులైలో రూ.1.73 లక్షలుగా కమిటీ ఖరారు చేసింది. తిరిగి గత నెలలో విచారణ జరిపి దాన్ని రూ.1.12 లక్షలకు కుదించింది. తాజాగా దాన్ని రూ.1.40 లక్షలకుపైగా పెంచింది. 


ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులు ఇలా..
బీటెక్, ఎంటెక్ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులు కూడా పెంచింది ప్రభుత్వం. కనీస వార్షిక రుసుముగా రూ. 27 ఖరారు చేసింది. పెరిగిన ధరలు 2022-23, 2023-24, 2024-25 అకాడమిక్ ఇయర్స్‌లో అమల్లో ఉంటాయి.

ఫీజు ఖరారు చేసిన కాలేజీల జాబితా ఇలా..:


:: ఇవీ చదవండి ::

విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!
జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'నీట్‌' పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం, కొత్త కటాఫ్ ఇదే!
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్‌ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సంటైల్‌ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్‌ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్‌ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Anantapur News: బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
Embed widget