అన్వేషించండి

AP IIIT Notification: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ రేపు (ఆగస్టు 20) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను సంప్రదించవచ్చు. ఇందులో ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లు ఉన్నాయి. 

Also Read: EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

సెప్టెంబర్ 26న పరీక్ష.. 
ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రూ.1000 ఆలస్య రుసముతో సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబర్ 26న విడుదల కానుంది. కీపై అభ్యంతరాలను సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తారు. తుది కీని అక్టోబర్ 2న విడుదల చేస్తారు. 

దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. మ్యాథమెటిక్స్ విభాగానికి 40 మార్కులు, ఫిజకల్ సైన్సెస్ విభాగానికి 40 మార్కులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. 

మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్..
సాధారణంగా ఏటా టెన్త్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: Schools Open: ఇప్పటికిప్పుడు స్కూల్స్ తెరిస్తే మీ పిల్లలని పంపుతారా ?

టాప్ హెడ్ లైన్స్

NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!

వీడియోలు

IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
Rahul Ravindran Chinmayi : పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్
పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్
ఇంటి గోడలకు మేకులు కొడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశలో మేకులు కొట్టకూడదని మీకు తెలుసా?
ఇంటి గోడలకు మేకులు కొడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశలో మేకులు కొట్టకూడదని మీకు తెలుసా?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Embed widget