అన్వేషించండి

AP IIIT Notification: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ రేపు (ఆగస్టు 20) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను సంప్రదించవచ్చు. ఇందులో ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లు ఉన్నాయి. 

Also Read: EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

సెప్టెంబర్ 26న పరీక్ష.. 
ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రూ.1000 ఆలస్య రుసముతో సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబర్ 26న విడుదల కానుంది. కీపై అభ్యంతరాలను సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తారు. తుది కీని అక్టోబర్ 2న విడుదల చేస్తారు. 

దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. మ్యాథమెటిక్స్ విభాగానికి 40 మార్కులు, ఫిజకల్ సైన్సెస్ విభాగానికి 40 మార్కులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. 

మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్..
సాధారణంగా ఏటా టెన్త్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: Schools Open: ఇప్పటికిప్పుడు స్కూల్స్ తెరిస్తే మీ పిల్లలని పంపుతారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Advertisement

వీడియోలు

Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్‌పై దాడి | ABP Desam
Mukhi Cheetah Given birth Five Cubs | ఫలించిన ప్రాజెక్ట్ చీతా...కునో నేషనల్ పార్క్ లో సంబరాలు | ABP Desam
Shivanasamudra Elephant Rescue | ఏనుగును కాపాడే రెస్క్యూ ఆపరేషన్ చూశారా.? | ABP Desam
అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
UP twin marriages: ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు -  భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు - భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Embed widget