అన్వేషించండి

AP IIIT Notification: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ రేపు (ఆగస్టు 20) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను సంప్రదించవచ్చు. ఇందులో ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లు ఉన్నాయి. 

Also Read: EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

సెప్టెంబర్ 26న పరీక్ష.. 
ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రూ.1000 ఆలస్య రుసముతో సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబర్ 26న విడుదల కానుంది. కీపై అభ్యంతరాలను సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తారు. తుది కీని అక్టోబర్ 2న విడుదల చేస్తారు. 

దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. మ్యాథమెటిక్స్ విభాగానికి 40 మార్కులు, ఫిజకల్ సైన్సెస్ విభాగానికి 40 మార్కులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. 

మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్..
సాధారణంగా ఏటా టెన్త్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: Schools Open: ఇప్పటికిప్పుడు స్కూల్స్ తెరిస్తే మీ పిల్లలని పంపుతారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jagapathi Babu on Vijayendra Prasad | Ruslaan మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జగపతిబాబు | ABP DesamThatikonda Rajaiah on Kadiyam Srihari | కడియం శ్రీహరిపై తీవ్రపదజాలంతో రాజయ్య ఫైర్ | ABP DesamNimmakayala Chinarajappa Interview | ఉభయ గోదావరిలో కూటమిదే క్లీన్ స్వీప్ | ABP DesamKL Rahul on Dhoni Impact | LSG vs CSK మ్యాచ్ తర్వాత ధోని గురించి మాట్లాడిన రాహుల్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget