అన్వేషించండి

EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం 120 కేంద్రాలను కేటాయించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం  నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)  పరీక్షలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు నేటి నుంచి ఆగస్టు 20, 23, 24, 25 తేదీల్లో.. ఫార్మసీ, అగ్రికల్చర్‌ అభ్యర్థులకు సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 200 నుంచి 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఈఏపీసెట్‌ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు నిర్ధేశించిన సమయం కంటే కనీసం రెండున్నర గంటలు ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

మొత్తం 120 పరీక్ష కేంద్రాలు..
ఈఏపీసెట్ పరీక్షల కోసం ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి మొత్తం 120 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గుంటూరు నగరం సహా ఇతర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.  ఈ రోజు పరీక్షకు ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్ష కోసం మొత్తం 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం దాదాపు 3 వేల మంది హాజరుకానున్నారు.

ప్రాథమిక 'కీ' ఆగస్టు 25న..
ఇంజనీరింగ్‌ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 25న.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రాథమిక 'కీ'ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 1,75,796 మంది ఇంజనీరింగ్‌ను.. 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. 717 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండింటినీ ఎంచుకున్నారని వివరించారు. 
కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్..
కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించబోమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వీరికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి.. ఈఏపీసెట్‌ పరీక్షను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని వెల్లడించారు. 

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
Weakest Currency : ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Embed widget