అన్వేషించండి

EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం 120 కేంద్రాలను కేటాయించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం  నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)  పరీక్షలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు నేటి నుంచి ఆగస్టు 20, 23, 24, 25 తేదీల్లో.. ఫార్మసీ, అగ్రికల్చర్‌ అభ్యర్థులకు సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 200 నుంచి 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఈఏపీసెట్‌ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు నిర్ధేశించిన సమయం కంటే కనీసం రెండున్నర గంటలు ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

మొత్తం 120 పరీక్ష కేంద్రాలు..
ఈఏపీసెట్ పరీక్షల కోసం ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి మొత్తం 120 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గుంటూరు నగరం సహా ఇతర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.  ఈ రోజు పరీక్షకు ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్ష కోసం మొత్తం 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం దాదాపు 3 వేల మంది హాజరుకానున్నారు.

ప్రాథమిక 'కీ' ఆగస్టు 25న..
ఇంజనీరింగ్‌ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 25న.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రాథమిక 'కీ'ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 1,75,796 మంది ఇంజనీరింగ్‌ను.. 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. 717 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండింటినీ ఎంచుకున్నారని వివరించారు. 
కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్..
కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించబోమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వీరికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి.. ఈఏపీసెట్‌ పరీక్షను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని వెల్లడించారు. 

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Embed widget