అన్వేషించండి

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వమిస్తారు.

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.

★ నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశ ప్రకటక 2023-24

1) బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)

సీట్ల సంఖ్య:
123.

కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 45 శాతం మార్కులతో ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. ఓసీఐ/పీఐఓ/విదేశీ అభ్యర్థులకు కనీసం 65 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.


Also Read:  AP RCET - 2022: ఏపీ ఆర్‌సెట్ షెడ్యూలు వచ్చేసింది, ఏరోజు ఏ పరీక్ష అంటే?


2) ఎల్‌ఎల్‌ఎం 

సీట్ల సంఖ్య: 81.

కోర్సు వ్యవధి: ఏడాది. 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


Also Read:   జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?



3) పీహెచ్‌డీ


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీ సం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు అయిదు, ఏఐఎల్‌ఈటీ మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు అయిదు, ఏఐఎల్‌ఈటీ మెరిట్‌ ద్వారా ఫెలోషిప్‌ పొందినవారికి నాలుగు సీట్లు ప్రత్యేకించారు. యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్నవారు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.3500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో బీపీఎల్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

 

Also Read:  NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!



పరీక్ష విధానం:


బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 50, కరెంట్‌ అఫైర్స్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 30, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంటన్నర.

ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌కు 75 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 150. పరీక్ష సమయం గంటన్నర. మొదటి సెక్షన్‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్‌లో లీగల్‌ రీజనింగ్‌ నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. వీటికి నెగెటివ్‌ మార్కులు లేవు. రెండో సెక్షన్‌లో లా విభాగాలకు సంబంధించి పది డిస్ర్కిప్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో రెంటికి సమాధానాలు రాయాలి. మొదటి సెక్షన్‌లో ప్రతి పార్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే రెండో సెక్షన్‌ను పరిశీలిస్తారు. 

పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో లీగల్‌ నాలెడ్జ్‌, లీగల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. రెండో సెక్షన్‌లో రిసెర్చ్‌కు సంబంధించి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. సెక్షన్‌కు 50 చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర.


Also Read:  EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!


ముఖ్యమైన తేదీలు..

★ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2022.

★ అడ్మిట్‌ కార్డ్ డౌన్‌లోడ:  22.11.2022 నుంచి

★ ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 తేదీ: 11.12.2022.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

Notification

Online Application

WEBSITE


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Embed widget