అన్వేషించండి

JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు

JEE Advanced 2026 | జేఈఈ మెయిన్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఐఐటీ రూర్కీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కానున్నారు. ఐఐటీలలో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ నిర్వహిస్తారు.

దేశంలోని లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీలో ప్రవేశం కోసం కలలు కంటున్న విద్యార్థుల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced) 2026 తేదీ ఖరారు చేశారు. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17, 2026న నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల ఆధారంగా సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) చేపట్టింది.

ప్రతి సంవత్సరం లాగానే, ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్స్‌ (JEE Mains)లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. వివిధ వర్గాల నుండి ఎంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారనేది ముందే నిర్ణయించారు. అయితే, గత కొన్ని సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఈ సంఖ్య 2.5 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటున్నాయి.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థుల మార్కులు ఒకేలా ఉన్నప్పుడు, ర్యాంకును నిర్ణయించడానికి కొన్ని నియమాలను పాటిస్తారు. ముందుగా, ఏ విద్యార్థికి పాజిటివ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయో చూస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. అటువంటి పరిస్థితుల్లో, సరైన ప్రశ్నలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాజిటివ్ మార్కులు కూడా సమానంగా ఉంటే, ముందుగా గణితంలో మార్కులు, ఆ తర్వాత కూడా సమానంగా ఉంటే, ఫిజిక్స్‌లో మార్కులు చూస్తారు. ఇవన్నీ తర్వాత స్కోర్ ఒకేలా ఉంటే, అటువంటి విద్యార్థులకు ఒకే ర్యాంకు ఇస్తారు.

గత సంవత్సరం 

2024లో సుమారు 2 లక్షల 50 వేల 284 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ లో పోటీ పడ్డారు. 2025లో ఈ సంఖ్య కొంచెం తగ్గి సుమారు 2 లక్షల 50 వేల 236గా ఉంది. 2025లో కటాఫ్ కూడా కొంచెం తగ్గించడంతో కొంతమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా విద్యార్థులు బాగా ప్రిపేర్ అయితే ఐఐటీలో ప్రవేశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23, 2026న ప్రారంభం కానుంది. మే 2, 2026 వరకు ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఒకే రోజు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. 2 పేపర్లు రాయడం అందరు అభ్యర్థులకు తప్పనిసరి. ఏదైనా ఒక పేపర్‌లో హాజరుకాని విద్యార్థికి ర్యాంకు కేటాయించరు.

జేఈఈ ఎగ్జామ్ రూల్స్..

జేఈఈ పరీక్ష నియమాల ప్రకారం, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పాల్గొనడానికి అభ్యర్థి పుట్టిన తేదీ అక్టోబర్ 1, 2001 లేదా ఆ తర్వాత ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల విద్యార్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఇస్తారు. ఏ విద్యార్థి అయినా ఈ పరీక్షను గరిష్టంగా 2 సార్లు మాత్రమే రాయగలరు. అది కూడా వరుసగా రెండు సంవత్సరాలలో. అంటే, ఒక విద్యార్థి ఇప్పటికే రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి ఉంటే, మరోసారి రాసే అవకాశం లేదు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Adilabad Adivasis: అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Adilabad Adivasis: అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Trump Tariffs On India: ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!
ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య!
Embed widget