అన్వేషించండి

JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు

JEE Advanced 2026 | జేఈఈ మెయిన్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఐఐటీ రూర్కీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కానున్నారు. ఐఐటీలలో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ నిర్వహిస్తారు.

దేశంలోని లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీలో ప్రవేశం కోసం కలలు కంటున్న విద్యార్థుల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced) 2026 తేదీ ఖరారు చేశారు. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17, 2026న నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల ఆధారంగా సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) చేపట్టింది.

ప్రతి సంవత్సరం లాగానే, ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్స్‌ (JEE Mains)లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. వివిధ వర్గాల నుండి ఎంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారనేది ముందే నిర్ణయించారు. అయితే, గత కొన్ని సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఈ సంఖ్య 2.5 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటున్నాయి.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థుల మార్కులు ఒకేలా ఉన్నప్పుడు, ర్యాంకును నిర్ణయించడానికి కొన్ని నియమాలను పాటిస్తారు. ముందుగా, ఏ విద్యార్థికి పాజిటివ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయో చూస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. అటువంటి పరిస్థితుల్లో, సరైన ప్రశ్నలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాజిటివ్ మార్కులు కూడా సమానంగా ఉంటే, ముందుగా గణితంలో మార్కులు, ఆ తర్వాత కూడా సమానంగా ఉంటే, ఫిజిక్స్‌లో మార్కులు చూస్తారు. ఇవన్నీ తర్వాత స్కోర్ ఒకేలా ఉంటే, అటువంటి విద్యార్థులకు ఒకే ర్యాంకు ఇస్తారు.

గత సంవత్సరం 

2024లో సుమారు 2 లక్షల 50 వేల 284 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ లో పోటీ పడ్డారు. 2025లో ఈ సంఖ్య కొంచెం తగ్గి సుమారు 2 లక్షల 50 వేల 236గా ఉంది. 2025లో కటాఫ్ కూడా కొంచెం తగ్గించడంతో కొంతమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా విద్యార్థులు బాగా ప్రిపేర్ అయితే ఐఐటీలో ప్రవేశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23, 2026న ప్రారంభం కానుంది. మే 2, 2026 వరకు ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఒకే రోజు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. 2 పేపర్లు రాయడం అందరు అభ్యర్థులకు తప్పనిసరి. ఏదైనా ఒక పేపర్‌లో హాజరుకాని విద్యార్థికి ర్యాంకు కేటాయించరు.

జేఈఈ ఎగ్జామ్ రూల్స్..

జేఈఈ పరీక్ష నియమాల ప్రకారం, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పాల్గొనడానికి అభ్యర్థి పుట్టిన తేదీ అక్టోబర్ 1, 2001 లేదా ఆ తర్వాత ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల విద్యార్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఇస్తారు. ఏ విద్యార్థి అయినా ఈ పరీక్షను గరిష్టంగా 2 సార్లు మాత్రమే రాయగలరు. అది కూడా వరుసగా రెండు సంవత్సరాలలో. అంటే, ఒక విద్యార్థి ఇప్పటికే రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి ఉంటే, మరోసారి రాసే అవకాశం లేదు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget