అన్వేషించండి

TS EAPCET 2024కు దరఖాస్తుల వెల్లువ, 20 రోజుల్లో మరింత పెరుగనున్న అప్లికేషన్లు - కొత్త పరీక్ష కేంద్రాల వేటలో అధికారులు

TS EAPCET 2024కు దరఖాస్తులు పోటెత్తుతుండటంతో.. పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారులు దృష్టిసారించారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

TSEAPCET 2024 Applications: తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఎప్‌సెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రూ.250 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 9తో గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రూ.500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే దరఖాస్తుల సవరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చు.

Correction of Online Application Data

పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారుల దృష్టి..
టీఎస్ ఎప్‌సెట్‌-2024కు దరఖాస్తులు పోటెత్తుతుండటంతో.. పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారులు దృష్టిసారించారు. ఏప్రిల్ 9న సాయంత్రం వరకు ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి 2,50,919, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి 97,995, రెండింటికి హాజరయ్యే వారు 333 మంది చొప్పున మొత్తంగా 3,49,247 దరఖాస్తులు అందాయి. మే 1 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటంతో.. దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశముంది. దీంతో కొత్త సెంటర్ల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లోని ల్యాబ్‌ గదుల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నీ సౌకర్యాలూ ఉంటే ఆయా కళాశాలల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

జోన్లు బ్లాక్.. 
➥ రెండు, మూడు రోజుల వరకు హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో పరీక్ష కేంద్రాలు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ దరఖాస్తుల సంఖ్య పెరగడంతో.. ఇప్పుడు హైదరాబాద్‌-1, హైదరాబాద్‌-3 జోన్లను బ్లాక్‌ చేయాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇందులో జోన్‌-1లో 45,923, జోన్‌-3లో 39,835 సీటింగ్‌ కెపాసిటీ ఉండగా.. ఈ రెండు జోన్ల పరిమితి మించడంతో ఆయా జోన్లను అధికారులు బ్లాక్‌ చేశారు. హైదరాబాద్‌ జోన్‌-4 సామర్థ్యం 27 వేలు కాగా, ఇప్పటికే 26 వేల దరఖాస్తులు వచ్చాయి. జోన్‌-2 సామర్థ్యం 43,592 కాగా, ఇప్పటి వరకు 41 వేలకు పైగా వచ్చాయి. కొత్త దరఖాస్తుదారులకు ఈ జోన్‌లోనే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. ఇంకా 4 వేలకు పైగా దరఖాస్తులొస్తే ఇవి కూడా బ్లాక్‌ చేయాల్సిందే.

➥ హైదరాబాద్‌ తర్వాత ఇంజినీరింగ్‌కు అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11,900, ఉమ్మడి కరీంనగర్‌లో 10,770 సీటింగ్‌ సామర్థ్యం ఉండగా, మొత్తం నిండిపోవడంతో వీటినీ బ్లాక్‌ చేశారు.

➥ చిన్న పట్టణమైన నర్సంపేటలో ఇంజినీరింగ్‌కు 2,255, ఫార్మసీకి 1,353 మంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయించే వీలుండగా, సమీప ప్రాంతాల నుంచి భారీగా దరకఖాస్తులు రావడంతో అక్కడ పరీక్ష కేంద్రం కేటాయింలేని పరిస్థితి తలెత్తింది. సత్తుపల్లిలో ఇంజినీరింగ్‌ 2,085, ఫార్మసీకి 1,251 సామర్థ్యం ఉండగా, పరిమితి మించడంతో బ్లాక్‌ చేశారు.

➥ ఇక ఫార్మసీ విద్యార్థుల కోసం కేటాయించిన సెంటర్లల్లో 22 వేల వరకు సీట్లు ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌ జోన్‌-1లో 2,445, జోన్‌-2లో 16,660 చొప్పున ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఫార్మసీకి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు మరింత గడువు ఉన్న నేపథ్యంలో.. పరిస్థితిని చూసి దరఖాస్తులు తక్కువగా వస్తే ఫార్మసీ సెంటర్లల్లోని ఖాళీలను ఇంజినీరింగ్‌ విభాగం వాళ్లకు బదిలీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

వివరాలు…

➥ టీఎస్ ఎప్‌సెట్-2024

ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).

అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ), 

అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు: ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
నోటిఫికేషన్ వెల్లడి 21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 26.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 06.04.2024.
దరఖాస్తుల సవరణ 08.04.2024 - 12.04.2024.
రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 09.04.2024.
రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 14.04.2024. 
రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 19.04.2024. 
రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 01.05.2024.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ 29.04.2024.
పరీక్ష తేది 07.05.2024 - 11.05.2024.
అగ్రికల్చర్ & ఫార్మసీ 07-05-2024 (FN & AN)
08-05-2024 (FN)
ఇంజినీరింగ్ 09-05-2024 (FN & AN)
10-05-2024 (FN & AN)
11-05-2024 (FN)

TS EAPCET - 2024 Detailed Notification

Pay Registration Fee 

Fill Online Application

Print Filled-in Application

Know Your Fee Payment Status

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget