అన్వేషించండి

NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

వచ్చే ఏడాది నీట్ యూజీ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఓఎంఆర్ (OMR) షీట్ విధానంలో కాకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్ కోసం విద్యార్థులు తమ సౌలభ్యం ప్రకారం సిటీని ఎంచుకోవడానికి ఒక వారం సమయం లభిస్తుందని, Admit Cards జూన్ 14 న విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

నీట్ పేపర్ లీక్ కేసుపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకులపై స్పందించారు. 'విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎన్‌టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న నిర్వహించింది. మే 7న ఎన్‌టీఏకు ఒక అభ్యంతరం వ్యక్తమైంది. గెస్ పేపర్‌లోని కొన్ని ప్రశ్నలు ఈ ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ పేపర్‌లో వచ్చాయని తెలిసింది. ఎన్‌టీఏ, ప్రభుత్వం వెంటనే దీనిపై దర్యాప్తు చేపట్టాయి.  ఈసారి పేపర్ లీక్ అయిందని మా దృష్టికి రాగానే, ఎడ్యుకేషన్ మాఫియా కుట్రల వల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకూడదని భావించాం. అందుకే, నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు మే 12న ప్రకటించాం' అని తెలిపారు.

Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

ఎలాంటి అవకతవకలను సహించేది లేదు
‘రద్దు చేసిన ఎగ్జామ్ వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జూ్ 21న రీఎగ్జామ్ నిర్వహించనున్నామని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకునేందుకుగానూ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించింది. అన్ని శాఖలు దీనిని తీవ్రంగా పరిగణించి రంగంలోకి దిగాయి. ఎలాంటి అవకతవకలను సహించేది లేదని’ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 

22 లక్షల మంది అభ్యర్థులు..

నీట్ యూజీ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. భారత్‌లోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లోని మొత్తం 5,432 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఆన్సర్ కీ విడుదలైన తర్వాత చేతితో రాసిన ఒక గెస్‌ పేపర్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ గెస్‌ పేపర్‌లోని ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా, ఏకంగా 120 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ మరియు 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget