అన్వేషించండి

NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

వచ్చే ఏడాది నీట్ యూజీ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఓఎంఆర్ (OMR) షీట్ విధానంలో కాకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్ కోసం విద్యార్థులు తమ సౌలభ్యం ప్రకారం సిటీని ఎంచుకోవడానికి ఒక వారం సమయం లభిస్తుందని, Admit Cards జూన్ 14 న విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

నీట్ పేపర్ లీక్ కేసుపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకులపై స్పందించారు. 'విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎన్‌టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న నిర్వహించింది. మే 7న ఎన్‌టీఏకు ఒక అభ్యంతరం వ్యక్తమైంది. గెస్ పేపర్‌లోని కొన్ని ప్రశ్నలు ఈ ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ పేపర్‌లో వచ్చాయని తెలిసింది. ఎన్‌టీఏ, ప్రభుత్వం వెంటనే దీనిపై దర్యాప్తు చేపట్టాయి.  ఈసారి పేపర్ లీక్ అయిందని మా దృష్టికి రాగానే, ఎడ్యుకేషన్ మాఫియా కుట్రల వల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకూడదని భావించాం. అందుకే, నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు మే 12న ప్రకటించాం' అని తెలిపారు.

Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

ఎలాంటి అవకతవకలను సహించేది లేదు
‘రద్దు చేసిన ఎగ్జామ్ వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జూ్ 21న రీఎగ్జామ్ నిర్వహించనున్నామని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకునేందుకుగానూ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించింది. అన్ని శాఖలు దీనిని తీవ్రంగా పరిగణించి రంగంలోకి దిగాయి. ఎలాంటి అవకతవకలను సహించేది లేదని’ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 

22 లక్షల మంది అభ్యర్థులు..

నీట్ యూజీ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. భారత్‌లోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లోని మొత్తం 5,432 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఆన్సర్ కీ విడుదలైన తర్వాత చేతితో రాసిన ఒక గెస్‌ పేపర్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ గెస్‌ పేపర్‌లోని ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా, ఏకంగా 120 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ మరియు 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
CBSE Parenting Calendar 2026: సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 
సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Embed widget