అన్వేషించండి

TS LAWCET 2024 Toppers: తెలంగాణ లాసెట్‌లో 29,258 మంది అభ్యర్థులు అర్హత, విభాగాలవారీగా టాపర్లు వీరే

LAWCET 2024 Results: జూన్ 13న విడుదలైన లాసెట్ ఫలితాల్లో మొత్తం 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలకు మొత్తం 40,268 మంది హాజరుకాగా.. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు.

TS LAWCET 2024 Results: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు జూన్ 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 29,258 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మూడేళ్ల లా కోర్సులో 25,510 మంది అర్హత సాధించగా.. 73.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 5,478 మంది అర్హత సాధించగా.. 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక పీజీఎల్‌‌సెట్‌‌లో 3,270 మంది అర్హత సాధించగా.. 84.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్త 50,684 మంది అభ్యర్థులు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోగా.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు.  

లాసెట్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో 20,237 మంది పురుషులు, 9,017 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. లాసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారిలో బీకాం విద్యార్థులు 5790 మంది, బీఎస్సీ విద్యార్థులు 5068, బీఏ విద్యార్థులు 4044, బీటెక్ విద్యార్థులు 4485 మంది ఉన్నారు. వీటితోపాటు బీబీఏ, బీసీఏ, బీబీఎం, ఎంబీబీఎస్, బీడీఎస్, బీ-ఫార్మసీ, ఫార్మా-డీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారు కూడా లాసెట్ పరీక్షలో అర్హత సాధించారు. వీరికి కన్వీనర్ కోటా కింద సీట్లు కేటాయించనున్నారు.

టాపర్లు వీరే..

➥ మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో హైదరాబాద్‌‌లోని గాంధీనగర్‌కు చెందిన పీజీఎం అంబేద్కర్ 97.49 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలికి చెందిన ప్రత్యూష 96.65 మార్కులతో రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేశ్‌ 95.74 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.

➥ ఐదేళ్ల లా డిగ్రీ కోర్సులో హైదరాబాద్‌‌లోని మియాపూర్‌కు చెందిన బొడ్డు శ్రీరామ్ 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన పిప్పిరిశెట్టి దినేశ్ 87 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌‌లోని మల్కాజ్‌గిరి చెందిన తల్లూరి నరేశ్‌ 84 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.

➥ రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో సికింద్రాబాద్‌కు చెందిన పి.బాలసాయి విష్ణువర్ధన్ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఏపీలోకి క్రిష్ణా జిల్లా కానూరుకు చెందిన పొట్లూరి అబినీత్ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌‌లోని జాంబాగ్‌కు చెందిన నమన్ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.

ALSO READ: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే

లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను జూన్ 3న మొత్తం మూడుసెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 

8,180 సీట్లు అందుబాటులో..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) నుంచి అనుమతి రాగానే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లా కాలేజీలు ఉన్నాయి, వాటిలో 8 ప్రభుత్వ కళాశాలలు కాగా.. మిగతావి ప్రైవేటు కాలేజీలు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని రెండు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక్కో కళాశాలలో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉంది. వీటిల్లో మొత్తం 8,180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లు 7 వేల వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లా డిగ్రీకి సంబంధించి 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిస్తే సాయంకాలం ఎల్‌ఎల్‌బీ కోర్సును కూడా ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అంతకు ముందు 2000 వరకు సాయంత్రం ఎల్‌ఎల్‌బీ కోర్సు అందుబాటులో ఉండేది. ఈ కోర్సులకు ఆదరణ లేని కారణంగా అప్పట్లో బీసీఐ  నిషేధించింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Embed widget