అన్వేషించండి

AP Inter Betterment Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్‌.. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉంది

AP Intermediate betterment exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి ఇంటర్‌ బెటర్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (సెప్టెంబర్ 15) నుంచి ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈసారి ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వం ఫలితాలను వెల్లడించింది. కనీస మార్కులతో విద్యార్థులను పాస్ చేసింది. అయితే ఫలితాలతో సంతృప్తి చెందని వారికి మార్కులు పెంచుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. బెటర్‌మెంట్‌ పరీక్ష ద్వారా ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పించింది. బుధవారం (నేడు) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు బెటర్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. 4 లక్షల మంది పరీక్షల హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ..
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. 

పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు, వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిమిషం నిబంధనను అమలు చేయడం లేదని తెలిపారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకు కాస్త ఆలస్యంగా హాజరైనా విద్యార్థులను అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించడంతో పాటు.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

ఈ పరీక్షలు ఎందుకంటే.. 
కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసి.. అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశాన్ని కల్పించింది. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్‌ షీట్స్, నామినల్‌ రోల్స్‌ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించామని చెప్పారు. జంబ్లింగ్‌ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. 

Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

ALso Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Advertisement

వీడియోలు

New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Constable Kanakam Series Season 2 : 'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!
Road Accidents in AP and Telangana: వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
2025 Hyundai Venue కొత్త వెర్షన్‌లో ఏం మారింది? పాత వెన్యూతో పోలిస్తే ఎలాంటి తేడాలు కనిపిస్తాయి?
Hyundai Venue New vs Old: ఏ మోడల్‌ లుక్‌ బాగుంది?
Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
Embed widget