అన్వేషించండి

JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

JEE Main Result 2021: జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు.

జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత ఐదు రోజులుగా ఫలితాల కోసం వేచిచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 18 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. మొత్తం 44 మంది 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన దుగ్గినేని వెంకట పణీష్‌, కర్నం లోకేశ్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు.. తెలంగాణకు చెందిన జోస్యుల వెంకటాదిత్య, కొమ్మ శరణ్యలకు మొదటి ర్యాంకు వచ్చింది. పరీక్ష ఫలితాలపై కేంద్ర విద్యా శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను jeemain.nta.nic.inలో తెలుసుకోవచ్చు. 

అర్ధరాత్రి దాటాక ఫలితాలు.. 
మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ నాలుగో విడత ఫలితాలు విడుదల చేస్తారని వార్తలు రావడంతో విద్యార్థులు అర్ధరాత్రి వరకు వేచిచూశారు. అర్ధరాత్రి దాటాక ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌ నాలుగో సెషన్ పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించారు. పరీక్ష పేపర్ కీని సెప్టెంబర్‌ 6న రిలీజ్ చేశారు. కాగా.. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 11వ తేదీన స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఫలితాల విడుదలలో జాప్యం నెలకొన్న కారణంగా వాయిదా వేశారు. ఇక అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. 

ఇదే అత్యధికం.. 
జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం 7.32 లక్షల మంది నాలుగో సెషన్ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సెషన్‌లో 6.61 లక్షల మంది, రెండో సెషన్‌లో 6.19 లక్షల మంది, మూడో సెషన్‌లో 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగు, ఉర్దూ భాషలతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ సహా 13 భాషలలో నిర్వహిస్తారు.

Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget