అన్వేషించండి

JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

JEE Main Result 2021: జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు.

జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత ఐదు రోజులుగా ఫలితాల కోసం వేచిచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 18 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. మొత్తం 44 మంది 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన దుగ్గినేని వెంకట పణీష్‌, కర్నం లోకేశ్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు.. తెలంగాణకు చెందిన జోస్యుల వెంకటాదిత్య, కొమ్మ శరణ్యలకు మొదటి ర్యాంకు వచ్చింది. పరీక్ష ఫలితాలపై కేంద్ర విద్యా శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను jeemain.nta.nic.inలో తెలుసుకోవచ్చు. 

అర్ధరాత్రి దాటాక ఫలితాలు.. 
మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ నాలుగో విడత ఫలితాలు విడుదల చేస్తారని వార్తలు రావడంతో విద్యార్థులు అర్ధరాత్రి వరకు వేచిచూశారు. అర్ధరాత్రి దాటాక ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌ నాలుగో సెషన్ పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించారు. పరీక్ష పేపర్ కీని సెప్టెంబర్‌ 6న రిలీజ్ చేశారు. కాగా.. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 11వ తేదీన స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఫలితాల విడుదలలో జాప్యం నెలకొన్న కారణంగా వాయిదా వేశారు. ఇక అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. 

ఇదే అత్యధికం.. 
జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం 7.32 లక్షల మంది నాలుగో సెషన్ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సెషన్‌లో 6.61 లక్షల మంది, రెండో సెషన్‌లో 6.19 లక్షల మంది, మూడో సెషన్‌లో 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగు, ఉర్దూ భాషలతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ సహా 13 భాషలలో నిర్వహిస్తారు.

Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget