అన్వేషించండి

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేసినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (సెప్టెంబర్ 11) ఉదయం ప్రారంభం కావడం లేదని ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూలులో పలు మార్పులు చేసినట్లు వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20న సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుందని వర్సిటీ పేర్కొంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. అక్టోబర్ 3న యథాతథంగా జరగనుందని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడి ఆలస్యం అవడంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

రేపు లేదా ఎల్లుండి జేఈఈ మెయిన్ ఫలితాలు!
జేఈఈ మెయిన్ ఫలితాలు రేపు సాయంత్రం (సెప్టెంబర్ 12) లేదా ఎల్లుండి ఉదయం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు నిన్న (సెప్టెంబర్ 10) రిలీజ్ అవుతాయన్న వార్తల నేపథ్యంలో అభ్యర్థులు వేచి చూశారు. అయితే నిన్న ఫలితాల గురించి ఎన్‌టీఏ ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల హరియాణాలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై జాప్యం నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు కాకుండా.. మిగతా వారి ఫలితాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. 

అక్టోబర్ 3న జేఈఈ మెయిన్స్..
జేఈఈ మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మాత్రమే జేఈఈ అడ్వన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3న రెండు షిఫ్ట్‌లలో జరగనుంది. మొదటి షిఫ్ట్ లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ I పరీక్ష ఉంటుంది. రెండవ షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు.

Also Read: Petrol-Diesel Price, 11 September 2021: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసాలు.. ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Also Read: Horoscope Today : ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించాలి..కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఏపనీ చేయొద్దు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget