అన్వేషించండి

AP EDCET 2021: 21న ఏపీ ఎడ్‌సెట్‌.. 24 నుంచి పీఈసెట్.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌లు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్‌సెట్‌ పరీక్షను ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్‌ కె.విశ్వేశ్వరరావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు పరీక్ష షెడ్యూళ్లను విడుదల చేస్తున్నారు. నిన్న (సెప్టెంబర్ 17) ఏపీ ఐసెట్ పరీక్ష పూర్తవ్వగా.. మరో రెండు రోజుల్లో ఎడ్‌సెట్‌ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ ( Education Common Entrance Test) పరీక్షను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్‌ కె.విశ్వేశ్వరరావు తెలిపారు. 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

పరీక్ష సమయానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఎగ్జామ్ సెంటరుకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం, తేదీ, సమయం వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తామని తెలిపారు. ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం మొత్తం 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ సహా మరిన్ని వివరాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

24 నుంచి ఏపీ పీఈసెట్ (AP PECET)
రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ (B.P.Ed), యూజీడీపీఈడీ (U.G.D.P.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీఈసెట్ (Physical Education Common Entrance Test) 2021 ప్రవేశ పరీక్షను ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు నాగార్జున యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కోర్సుల్లో ప్రవేశాలకు 1,857 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పురుష అభ్యర్థులకు.. 27వ తేదీన మహిళా అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ పీఈసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఐసెట్ పరీక్షకు 90.03 శాతం హాజరు
ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ 2021 పరీక్షకు మొదటి రోజు (సెప్టెంబర్ 17) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. తొలిరోజు 90.03 శాతం మంది హాజరైనట్లు వెల్లడించారు. 

Also Read: AP Degree Admissions: నేటి నుంచి ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Also Read: TSCHE: ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ నోటిఫికేషన్.. తుది గడువు ఎప్పటివరకు అంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fire Colours: చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?
చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?
Career in Fine Arts : ఫైన్ ఆర్ట్స్​లో కెరీర్ అవకాశాలు.. ఫ్యాషన్ డిజైనర్ నుంచి గ్రాఫిక్ డిజైనర్ వరకు ఎంపికలు, పూర్తి వివరాలివే
ఫైన్ ఆర్ట్స్​లో కెరీర్ అవకాశాలు.. ఫ్యాషన్ డిజైనర్ నుంచి గ్రాఫిక్ డిజైనర్ వరకు ఎంపికలు, పూర్తి వివరాలివే
ABP Desam Smart Ed Conclave 2026 : ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget