అన్వేషించండి

Engineering Colleges: ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, 73 కాలేజీలకు 'నో' పర్మిషన్

ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు.

ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 7న ప్రారంభమైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 12 గంటలకే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్ ఆప్షన్ల నమోదుకోసం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 
వెబ్‌ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..

వెబ్‌ ఆప్షన్ల నమోదు షెడ్యూలు ఇలా..

➥ ఆప్షన్ల నమోదు: 07.08.2023 నుంచి 12.08.2023 వరకు.

➥ ఆప్షన్లలో మార్పులు: 13.08.2023.

➥ సీట్ల కేటాయింపు: 17.08.2023.

➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌: 18.08.2023 నుంచి 21.08.2023 వరకు.

➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 23.08.2023 నుంచి.

73 కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు నిలిపివేత..
ఏపీ ప్రభుత్వం 73 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేసింది. కౌన్సెలింగ్‌ జాబితా నుంచి కూడా ఆ కళాశాలలను తొలగించింది. ఏఐసీటీఈ 252 కళాశాలలకు అనుమతులిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం 179 కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించింది. దీనికి విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు, ఇతరత్ర సేవల కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను సదరు కళాశాలలు చెల్లించలేదని కారణంగా పేర్కొంది. వర్సిటీలు ఎలాంటి సేవలు అందించకుండానే ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాదాపు 50 కళాశాలలు హైకోర్టును గతంలోనే ఆశ్రయించాయి. వీటిలో 11 కళాశాలలను కౌన్సెలింగ్‌లో పెట్టాలని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బోధనారుసుముల చెల్లింపు భారాన్ని తగ్గించుకునేందుకే అనుమతులు నిలిపివేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

92 కళాశాలలకు రూ.43 వేలే ఫీజులు..
ఏపీలోని ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి కనీస ఫీజు రూ.43 వేలు, గరిష్ఠం రూ.77 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 220 ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఫీజులు నిర్ణయించగా 92 కళాశాలల్లో కనిష్ఠ ఫీజు రూ.43 వేలుగా ఉంది. గత నాలుగేళ్లుగా కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా హైకోర్టు ఆదేశాలతో రూ.8 వేలు పెరిగింది. అయితే ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎక్కువ కళాశాలకు కనిష్ఠ ఫీజునే నిర్ణయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు గతేడాది రూ.60 వేల పైగా ఫీజుండగా.. ఈ ఏడాది రూ.43 వేలకు కుదించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 

కన్వీనర్‌ సీట్లకు ఫీజుల నిర్ణయం..
ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌, మోహన్‌బాబు యూనివర్సిటీల్లో రూ.70 వేలు, సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో రూ.50 వేలు, భారతీయ ఇంజినీరింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ యూనివర్సీటీలో రూ.40 వేలుగా నిర్ణయించింది. ఎంబీఏ (రెండేళ్లు)కు రూ.70 వేలు, బీఏ, బీకాం, బీఎస్సీ (మూడేళ్లు)లకు కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలుతో పాటు బీబీఏ ఫీజును రూ.25 వేలుగా పేర్కొంది.

ALSO READ:

తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ABP Desam Smart Ed Conclave: చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు
చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు
ABP Desam SmartEd Conclave 2026: హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!
హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!
AP Intermediate Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌! మారిన రూల్స్ తెలుసుకోకుంటే పరీక్ష రాయలేరు! 
ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌! మారిన రూల్స్ తెలుసుకోకుంటే పరీక్ష రాయలేరు! 

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
TDP Communal Politics: రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
ABP Ideas of India Summit 2026: ఒక్క ఏడాదిలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, మరోవైపు అమెరికా టారిఫ్ వార్: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ఒక్క ఏడాదిలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, మరోవైపు అమెరికా టారిఫ్ వార్: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
IPS Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో చట్టపరమైన చిక్కుముడి - నాన్ బెయిలబుల్ వారెంట్‌తో చెక్ పెట్టవచ్చా?
ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో చట్టపరమైన చిక్కుముడి - నాన్ బెయిలబుల్ వారెంట్‌తో చెక్ పెట్టవచ్చా?
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Rinku Singh Father Passes Away: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Embed widget