అన్వేషించండి

AP SSC Results 2022: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు, ఈ ఏడాది గతానికి భిన్నంగా రిజల్ట్స్ ప్రకటన - అలా చేయొద్దని స్కూళ్లకు వార్నింగ్ !

AP SSC Results 2022: జూన్ రెండో వారంలో విడుదల అవుతాయనుకున్న టెన్త్ రిజల్ట్స్ వారం ముందుగానే రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ గురువారం టెన్త్ ఫలితాలపై కీలక ప్రకటన చేసింది.

AP 10th Results 2022: ఏపీలో పదో తరగతి ఫలితాలపై స్పష్టత వచ్చింది. జూన్ రెండో వారంలో విడుదల అవుతాయనుకున్న టెన్త్ రిజల్ట్స్ వారం ముందుగానే రిలీజ్ కానున్నాయి. జూన్ 4న (శనివారం) ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ గురువారం వెల్లడించింది. ప్రస్తుత విధానానికి భిన్నంగా ఈసారి టెన్త్ ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడకూడదని, ర్యాంకులను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రిజల్ట్స్ ఈసారి గేడ్లు కాదు..  
ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో విడుదల చేయనున్నారు. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్లు (2019 తర్వాత ) పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తరువాత టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని, ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ సూచనలు పాటించకుండా ఏవైనా విద్యా సంస్థలు, స్కూళ్లు కనుక ర్యాంకులు ప్రకటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు. టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను శనివారం నాడు అధికారిక వెబ్‌సైట్  https://www.bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలుశిక్ష..
రెండేళ్ల తరువాత నిర్వహించిన ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాల ప్రక్రియ సజావుగా జరగాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల ప్రకటనపై నిషేధం విధించింది. విద్యార్థులు గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ఫలితాలు అందుకుంటారు. ర్యాంకుల ప్రకటనపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, యాజమాన్యాలపై 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఎస్సీ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈమేరకు టెన్త్ ఫలితాల ప్రకటనపై జీవో జారీ చేశారు. 

Also Read: UPSC Results Update : 2013లో 1228 - ఇప్పుడు 710 మాత్రమే ! యూపీఎస్సీ పోస్టుల భర్తీని ఇంత భారీగా తగ్గించేశారేంటి ?

Also Read: AP Govt On Private Schools : ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్, ర్యాంకుల ప్రకటనలపై కఠిన చర్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget