అన్వేషించండి

AP Govt On Private Schools : ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్, ర్యాంకుల ప్రకటనలపై కఠిన చర్యలు

AP Govt On Private Schools : ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పదో తరగతి ర్యాంకుల ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

AP Govt On Private Schools : పదో తరగతి ఫలితాలు విడుదలైతే చాలు ఒకటి, ఒకటి , ఒకటి, రెండు, రెండు, అంటూ ప్రైవేట్ విద్యాసంస్థలు ర్యాంకుల పేరుతో టీవీల్లో, పేపర్లో ఊదరగొడతాయి. ఇలా యాడ్స్ ఇస్తూ వచ్చే ఏడాది సీట్లు భర్తీ చేసుకోవాలని ఆ విద్యాసంస్థలు భావిస్తాయి. ర్యాంకుల పేరుతో ఊదరగొట్టే ప్రైవేట్ విద్యా సంస్థలు, ట్యూటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. ర్యాంకుల ప్రకటనపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలపై మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఎస్సీ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో జారీ చేశారు. 

గ్రేడ్లకు బదులు మార్కులు 

పదో తరగతి పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ప్రకటించేవారు. కానీ 2020 నుంచి గ్రేడ్లకు బదులు మార్కుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థలకు ఉత్తమ, అత్యధిక ర్యాంకులు వచ్చాయని టీవీలు, పేపర్లలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పటిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఇలాంటి ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు పక్కదోవ పట్టిస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. ర్యాంకుల పోటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెరుగుతోందని విద్యాశాఖ చాలా వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. 

ఏడేళ్ల జైలు శిక్ష 

ఏపీ పబ్లిక్ పరీక్షలు యాక్ట్-1997 ప్రకారం మాల్ ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలు చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు అంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో గ్రేడ్లకు బదులు  మార్కులతో  ఫలితాలు ప్రకటించనున్న కారణంగా ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థలు ర్యాంకులతో ప్రకటనలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఒకవేళ ర్యాంకులు ప్రకటిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల కంప్యూటరీకరణ పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. అయితే ఈ ఏడాది పరీక్షలు వివాదాల మధ్య జరిగాయి. మొదటి నుంచి పేపర్ల లీక్ , మాల్ ప్రాక్టీస్  గందరగోళం మధ్య పరీక్షలు నిర్వహించారు. మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి అరెస్టులు, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలపై కేసుల కూడా నడిచాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Abhishek Records: అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Palm Sunday : మట్టల ఆదివారంని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పామ్ సండే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
మట్టల ఆదివారంని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పామ్ సండే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
Embed widget