అన్వేషించండి

Agricet: అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 99.5 శాతం ఉత్తీర్ణులు

ఏపీలో అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'అగ్రిసెట్‌-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు అక్టోబరు 6న విడుదలయ్యాయి. అక్టోబర్‌ 7 నుంచి విద్యార్థుల మార్కుల జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అడ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబరు 1న నిర్వహించిన 'అగ్రిసెట్‌-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు అక్టోబరు 6న విడుదలయ్యాయి. వర్సిటీ పరిపాలన భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి శారద జయలక్ష్మీదేవి, అగ్రిసెట్‌ కన్వీనర్‌ సుధాకర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణల నుంచి మొత్తం 2006 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 1994 (99.5శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. అక్టోబర్‌ 7 నుంచి విద్యార్థుల మార్కుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. త్వరలోనే కౌన్సెలింగ్‌ తేదీలను వెల్లడించనున్నట్లు రిజిస్ట్రార్‌ రామారావు వెల్లడించారు.

అగ్రిసెట్-2203 టాపర్లు వీరే..

➥ అగ్రికల్చర్ కోర్సులో ఆర్‌.హేమంతకుమార్‌ 119, పి.రామప్రతాప్, వి.హరీష్‌ 118 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 

➥ సేంద్రియ వ్యవసాయ కోర్సులో ఎరుకల యశస్విని 107, ఎం.లహరి 100, సి.కార్తికేయ 98 మార్కులతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 

➥ విత్తన సాంకేతిక కోర్సులో తెలంగాణ విద్యార్థులు యు.బాలాజి, ఎల్‌.రాకేష్‌ 106, జి.లీలా మాళవిక 96 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాలు సాధించారు. 

Website

ALSO READ:

CPGET: సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)-పార్ట్‌ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సెప్టెంబరు 27తో ముగిసిన గడువును అక్టోబరు 9 వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్‌ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్‌ సర్వీస్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్‌ లభించదు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions : స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు, మెట్రో టేకోవర్‌కు ప్రత్యేక కమిటీ- తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు, మెట్రో టేకోవర్‌కు ప్రత్యేక కమిటీ- తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
Medchal Fire Accident:  మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ  !
మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ !
Priyank Kharge Karnataka: ఏపీ గూగుల్ పెట్టుబడిపై కర్ణాటకలో దుమారం - ఐటీ మంత్రి ఖర్గేపై విపక్షాల ప్రశ్నల వర్షం
ఏపీ గూగుల్ పెట్టుబడిపై కర్ణాటకలో దుమారం - ఐటీ మంత్రి ఖర్గేపై విపక్షాల ప్రశ్నల వర్షం
Gujarat Cabinet Expansion: గుజరాత్‌లో శుక్రవారం మంత్రివర్గ విస్తరణ; రివాబా జడేజా, హర్ష్ సంఘవి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
గుజరాత్‌లో శుక్రవారం మంత్రివర్గ విస్తరణ; రివాబా జడేజా, హర్ష్ సంఘవి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
Advertisement

వీడియోలు

Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam
కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
‘నన్నెందుకు సెలక్ట్ చేయలేదు?’ సెలక్టర్లపై స్టార్ పేసర్ సీరియస్
కొత్త కెప్టెన్‌ని చూడగానే కోహ్లీ, రోహిత్ రియాక్షన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Decisions : స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు, మెట్రో టేకోవర్‌కు ప్రత్యేక కమిటీ- తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు, మెట్రో టేకోవర్‌కు ప్రత్యేక కమిటీ- తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
Medchal Fire Accident:  మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ  !
మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - బుగ్గి అయిన పాలిమర్ కంపెనీ !
Priyank Kharge Karnataka: ఏపీ గూగుల్ పెట్టుబడిపై కర్ణాటకలో దుమారం - ఐటీ మంత్రి ఖర్గేపై విపక్షాల ప్రశ్నల వర్షం
ఏపీ గూగుల్ పెట్టుబడిపై కర్ణాటకలో దుమారం - ఐటీ మంత్రి ఖర్గేపై విపక్షాల ప్రశ్నల వర్షం
Gujarat Cabinet Expansion: గుజరాత్‌లో శుక్రవారం మంత్రివర్గ విస్తరణ; రివాబా జడేజా, హర్ష్ సంఘవి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
గుజరాత్‌లో శుక్రవారం మంత్రివర్గ విస్తరణ; రివాబా జడేజా, హర్ష్ సంఘవి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
Sajjanar Warning: పిల్లలతో అలాంటి ఇంటర్యూలు చేసే వారికి సజ్జనార్ హెచ్చరిక - ఇక నుంచి కనిపిస్తే బయటపడలేని విధంగా కేసులే!
పిల్లలతో అలాంటి ఇంటర్యూలు చేసే వారికి సజ్జనార్ హెచ్చరిక - ఇక నుంచి కనిపిస్తే బయటపడలేని విధంగా కేసులే!
Telangana Politics: ఎవరీ రోహిన్ రెడ్డి? కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వ్యవహారంలో ఈయన పేరు ఎందుకు వినిపిస్తోంది?
ఎవరీ రోహిన్ రెడ్డి? కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వ్యవహారంలో ఈయన పేరు ఎందుకు వినిపిస్తోంది?
Modi Kurnool Tour: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
Embed widget