అన్వేషించండి

Telangana News: ఓయో లాడ్జిలో ప్రేమికులు- ప్రియుడు అనుమానాస్పద మృతి..!

Hyderabad News: అర్ధరాత్రి విశ్రాంతి తీసుకుని తెల్లవారి ఊరికి వెళ్లాలనుకుని.. ఓయో రూంలో యువతతో కలిసి దిగిన యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.

Man Died In Oyo Room : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఏడేళ్లు నుంచి అనేక ప్రాంతాలకు కలిసే తిరిగారు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఫంక్షన్‌కు వచ్చారు. ఆ ఫంక్షన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ అప్పటికే రాత్రి కావడంతో నగరంలోనే ఉండిపోయారు. ఓయో రూమ్ తీసుకుని అందులో ఉన్నారు. తెల్లవారితే ఇంటికి వెళ్ళిపోవాలని భావించారు. కానీ విధి మరోలా తలిచింది.

ఓయో రూముకు వెళ్ళిన గంటల వ్యవధిలోనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాత్రూం కి వెళ్ళిన యువకుడు అపస్మారక స్థితిలో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన యువతి యువకుడు స్నేహితులకు సమాచారాన్ని అందించింది. అయితే అప్పటికే యువకుడు మృతి చెందడం అనేక అనుమానాలకు కారణమైంది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఓయో లాడ్జిల్లో ఈ మధ్య కాలంలో అనుమాన్పాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రూములకు వెళ్లిన వారిలో ఎవరో ఒకరు చనిపోతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్లకు చెందిన హేమంత్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో కలిసి ఓయో రూముకు వెళ్లిన యువకుడు మృతి చెందడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఈ మృతికి సంబంధించి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జడ్చర్ల ప్రాంతానికి చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారిగా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతితో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీయడంతో ఎప్పటికప్పుడు బయట కలుస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓయో టౌన్‌ హౌస్‌లో గది తీసుకుని రాత్రికి అక్కడే బస చేశారు. రాత్రంతా ఇద్దరూ కలిసే రూములో ఉన్నారు. అయితే, రాత్రి రెండు గంటలు తరువాత బాత్రూమ్‌లోకి వెళ్లిన హేమంత్‌ బయటకు రాకపోవడంతో యువతి ఆందోళన చెందింది. లోపలకు వెళ్లి చూడగా హేమంత్‌ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన యువతి.. యువకుడు స్నేహితులకు సమాచారాన్ని అందించింది. 

మృతి చెందినట్టు నిర్ధారించిన పోలీసులు

స్నేహితులు వచ్చి హేమంత్‌ను మంచంపై పడుకోబెట్టి ప్రాథమిక వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అంబులెన్స్‌ సిబ్బంది హేమంత్‌ను పరీక్షించగా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన హేమంత్‌ తల్లిదండ్రులు పోలలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు బాత్రూమ్‌లో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు. ఎవరైనా బాత్రూమ్‌లో ఉండి ఏదైనా చేశారా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఓయో రూముకు వెళ్లిన యువకుడు మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Embed widget