అన్వేషించండి

Warangal Police: నకిలీ ఎన్ఐఏ అధికారితో పాటు ఇద్దరు దారి దోపిడీ దొంగల అరెస్ట్

Warangal Police: ఎన్ఐఏ అధికారిని అని చెప్తూ అమాయకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ అధికారితో పాటు దారి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు.

Warangal Police: రెండు వేర్వేరు సంఘటనల్లో ఎన్ఐఏ అధికారి పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితో పాటు మరో ఇధ్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆర్మీ యూనిఫారం, ల్యాప్ టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, ఒల సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వెల్లడించారు. 

నల్గొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలావాటు పడ్డాడు. ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. అందులో భాగంగానే ఆర్మీ యూనిఫారం, ఎయిర్ పిస్టల్ తో పాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకున్నాడు. గ్రామస్థులందరికీ ఆర్మీలో పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడు. ఊళ్లోని యువకులకు మర్చంట్ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు వ్యక్తుల నుండి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశాడు. శిక్షణ పేరుతో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరియర్ ఫౌండేషన్ లో చేర్పించాడు. తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువకులు.. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో వారు గొడవ చేయడంతో ఎవరి డబ్బులను వాళ్లకు ఇచ్చేశాడు. 

Warangal Police: నకిలీ ఎన్ఐఏ అధికారితో పాటు ఇద్దరు దారి దోపిడీ దొంగల అరెస్ట్

ఆ తర్వాత కూడా నిందితుడిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల ఎన్ఐఏ అధికారులు దేశంలో పిఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇండ్లల్లో తనీఖీలు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను చూశాడు. తాను కూడా ఎన్ఐఏ అధికారిగా మారి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. వెంటనే నకిలీ ఐడీకార్డు సృష్టించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అంతేకాకుండా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తు ఎయిర్ పిస్టల్ తో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో జైలుకు పంపిస్తానని బెదిరించిన సంఘటలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ ఎన్ఐఏ అధికారిని పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి ఆర్మీ యూనిఫారంతో పాటు ఎయిర్ పిస్టల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా.. చేసిన తప్పులన్నింటిని అంగీకరించాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహలో నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.

Warangal Police: నకిలీ ఎన్ఐఏ అధికారితో పాటు ఇద్దరు దారి దోపిడీ దొంగల అరెస్ట్

ఇద్దరు దారి దొపీడీ దొంగల అరెస్ట్..

మరో సంఘటనలో దారి దొపీడీ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను కేయూసి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 20 గ్రాముల బంగారు అభరణం, ఒక ద్విచక్రవాహనం, మూడు వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన గండికోట వెంకన్న, కంది అబ్బులు ఇద్దరు సేహ్నితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం నిందితులు ఈ నెల 13వ తారీకున అవుటర్ రింగ్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహన దారుడుని చంపుతామని బెదిరించి మెడలోని బంగారు అభరణాలు, మూడు వేల ఆరు వందల నగదుతో పాటు బలవంతంగా ఫోన్ పే ద్వారా మరో మూడు వేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించారు. 

Warangal Police: నకిలీ ఎన్ఐఏ అధికారితో పాటు ఇద్దరు దారి దోపిడీ దొంగల అరెస్ట్

పైరెండు సంఘటనల్లో నిందితులను గుర్తించి ఆరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్, కేయూసి ఇన్ స్పెక్టర్ దయాకర్, ఎస్ఐలు సతీష్, విజయ్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నర్సింగరావు, పాషా, సంపత్ తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Embed widget