అన్వేషించండి

Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

వరంగల్ జిల్లాలో సంచలనమైన ఫైనాన్షియర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

గత ఏడాది నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్య కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో ఫైనాన్షియర్ కోక వేంకటేశ్వరరావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ పరిచయంతో గురుమూర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన సొంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వరరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

Also Read: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం

ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తి హస్తం

అలాగే గురుమూర్తి తన రెండో కుమార్తె కాలేజీ ఫీజులు, వివాహం కోసం తన ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, రూ.15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటి దస్తావేజులు ఇవ్వాలని గురుముర్తి వెంకటేశ్వరరావు ఇవ్వాలని కోరాడు. అయితే తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని చెప్పడంతో వెంకటేశ్వరావుపై గురుమూర్తి ద్వేషం పెంచుకున్నాడు. చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంకటేశ్వర రావు ఇంటిలో కిరాయికి ఉంటున్న మరో వ్యక్తి నీలం శ్రీనివాస్ ఆర్థిక లావాదేవీల గొడవలతో యాజమానిపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో ఉన్న ఆర్థిక లావాదేవీల గోడవలు సమసిపోవాలంటే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటేశ్వర రావు హత్య చేసేందుకు అవసరమైన డబ్బు ఖర్చు చేసేందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. వెంకటేశ్వర రావును హత్య చేసేందుకు ఆకునూరి మహరాజ్ తో పాటు మరికొందరితో గురుమూర్తి, శ్రీనివాస్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు.       

Also Read:  'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ప్లాన్ ప్రకారం హత్య

ఫైనాన్స్ డబ్బులు వసూళ్ల కోసం  వెంకటేశ్వరరావు  దూపకుంట వస్తున్నట్లుగా తెలుసుకుని తూర్పుకోటకు వెళ్లే మార్గంలోని తాటివనంలో హత్యకు ప్లాన్ వేశారు. అనుకున్నట్లే గత నవంబర్  21న రాత్రి 8 గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ వెంకటేశ్వర రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటివనం వైపు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఆటోలో కాపుకాస్తున్న గురుమూర్తితో సహ మిగతా నిందితులు వేంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో ఉన్న రూ. పది వేల నగదును చోరీ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి సూచనల మేరకు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. గురువారం ఉదయం ఆర్థిక లావాదేవీలపై నిందితులందరూ చర్చించేందుకు రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget