అన్వేషించండి

Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

వరంగల్ జిల్లాలో సంచలనమైన ఫైనాన్షియర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

గత ఏడాది నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్య కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో ఫైనాన్షియర్ కోక వేంకటేశ్వరరావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ పరిచయంతో గురుమూర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన సొంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వరరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

Also Read: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం

ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తి హస్తం

అలాగే గురుమూర్తి తన రెండో కుమార్తె కాలేజీ ఫీజులు, వివాహం కోసం తన ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, రూ.15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటి దస్తావేజులు ఇవ్వాలని గురుముర్తి వెంకటేశ్వరరావు ఇవ్వాలని కోరాడు. అయితే తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని చెప్పడంతో వెంకటేశ్వరావుపై గురుమూర్తి ద్వేషం పెంచుకున్నాడు. చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంకటేశ్వర రావు ఇంటిలో కిరాయికి ఉంటున్న మరో వ్యక్తి నీలం శ్రీనివాస్ ఆర్థిక లావాదేవీల గొడవలతో యాజమానిపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో ఉన్న ఆర్థిక లావాదేవీల గోడవలు సమసిపోవాలంటే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటేశ్వర రావు హత్య చేసేందుకు అవసరమైన డబ్బు ఖర్చు చేసేందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. వెంకటేశ్వర రావును హత్య చేసేందుకు ఆకునూరి మహరాజ్ తో పాటు మరికొందరితో గురుమూర్తి, శ్రీనివాస్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు.       

Also Read:  'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ప్లాన్ ప్రకారం హత్య

ఫైనాన్స్ డబ్బులు వసూళ్ల కోసం  వెంకటేశ్వరరావు  దూపకుంట వస్తున్నట్లుగా తెలుసుకుని తూర్పుకోటకు వెళ్లే మార్గంలోని తాటివనంలో హత్యకు ప్లాన్ వేశారు. అనుకున్నట్లే గత నవంబర్  21న రాత్రి 8 గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ వెంకటేశ్వర రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటివనం వైపు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఆటోలో కాపుకాస్తున్న గురుమూర్తితో సహ మిగతా నిందితులు వేంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో ఉన్న రూ. పది వేల నగదును చోరీ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి సూచనల మేరకు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. గురువారం ఉదయం ఆర్థిక లావాదేవీలపై నిందితులందరూ చర్చించేందుకు రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Air Canada Express Plane Crash: న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget