News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..

వనపర్తి జిల్లాలో మూగజీవాలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి చివరికి ఆ పని చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో కాలంగా అతను ఈ పని చేసేవాడని గ్రామస్థులు తెలిపారు.

FOLLOW US: 
Share:

కామంతో కళ్లు మూసుకుపోయిన వారు కనీసం వావివరసలు తెలియకుండా ప్రవర్తించి ఆకృత్యాలకు పాల్పడ్డ ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. మానవత్వం లేని కామ పిశాచులు రాక్షసుల్లాగా ప్రవర్తించి అయిన వాళ్ల మీద, ఆఖరికి పసి పిల్లలని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే ఆశ్చర్యకర రీతిలో చనిపోయాడు. ఈ వికృత చేష్ట వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లాలో మూగజీవాలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి చివరికి ఆ పని చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో కాలంగా అతను ఈ పని చేసేవాడని గ్రామస్థులు తెలిపారు. అయితే, తాజాగా అతను అదే పని చేస్తూ చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నోసార్లు ఇలా గేదెలు, ఆవులపై అఘాయిత్యానికి పాల్పడుతూ దొరికిపోయినట్లు వెల్లడించారు. గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్న అతడు మళ్లీ అదే పని చేసేవాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రాణాలనే కోల్పోయాడు. 

Also Read: Jagitial: పెద్దపులిని చూపిస్తానని ఆశపెట్టి పిల్లల్ని తీసుకెళ్లిన తల్లి.. ఏడుస్తూ తిరిగొచ్చిన చిన్న కొడుకు.. గ్రామస్తులు షాక్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరానికి చెందిన ఆంజనేయులు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తుంటాడు. కూలీపని పైనే అతను జీవిస్తుంటాడు. అతను ఇటీవల ఓ గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామంలోని పలువురికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో గ్రామస్తులు ఇతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి గట్టిగా హెచ్చరించి వదిలేశారు.

అయితే, ఇంత జరిగాక కూడా అతను తన దుర్భుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ శనివారం బాల్ రెడ్డి అనే రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న గేదెపై అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదె తోక మెడకు బిగుసుకోవడం వల్ల ఉరి ఏర్పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతను నగ్నంగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం పశువుల కొట్టంలో ఆంజనేయులు విగత జీవిగా నగ్నంగా కనిపించడంతో బాల్ రెడ్డి ఆందోళనతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిపాడు. వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆంజనేయులు కుటుంబసభ్యులకు అప్పగించారు.


Also Read: Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పలుమార్లు మూగజీవాలపై అత్యాచారానికి పాల్పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఇందుకోసమే గేదెల కొట్టంలోకి వెళ్లి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేదె తోక మెడకు చుట్టుకొని పడిపోయి ఉన్న ఫోటోలను స్థానికులు తీశారు. ఆ సమయంలో అతను నగ్నంగా ఉన్నాడు. దీంతో పోలీసులు అత్యాచారం చేసే క్రమంలోనే చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆంజనేయులకు మానసిక స్థితి సరిగా లేదని అతడి సోదరుడు తెలిపాడు. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని, తాము విడిపించుకొని వచ్చినట్లుగా చెప్పాడు.

Also Read: Telangana Gadwal News: భార్యపై అనుమానం.. కొండ అంచున సెల్ఫీ డ్రామా.. భర్త మాస్టర్ ప్లాన్, చివరికి ఏమైందంటే!

Must See: In Pics: చూపుతిప్పుకోనివ్వని చార్మినార్, మూడు రంగుల లైట్లతో ముస్తాబు.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

Published at : 15 Aug 2021 09:23 AM (IST) Tags: Rape on Buffalo man sex with Buffalo Wanaparthy Buffalo news Wanaparthy News

ఇవి కూడా చూడండి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

టాప్ స్టోరీస్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు