అన్వేషించండి

Vizianagaram Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, గుండెపోటు చనిపోయాడని డ్రామా!

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భర్త హత్యకు గురవ్వగా, భార్య జైలు పాలైంది. వీరి ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

వివాహేతర సంబంధాలు(Extramarital Relations) వైవాహిక జీవితాలను నాశనం చేస్తున్నాయి. కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. పిల్లలకు ఆధారం లేకుండా రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి ఘటననే ఇది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం రాత్రి జరిగిన డేత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లా(Vizianagaram District) బొబ్బలి మండలంలోని పారాదిలో కలిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. వెంకటరమణను అతడి భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

అసలేం జరిగిదంటే

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... వెంకటరమణకు లలితకుమారితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లు పారాదిలో నివాసం ఉంటుంది. వీరికి ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని ఉన్నారు.  గత కొంతకాలంగా లలితకుమారికి అదే గ్రామానికి చెందిన  నరసింగరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటరమణ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో లలితకుమారికి ప్రియుడు నరసింగరావు మెసేజ్‌ చేశాడు. ఇద్దరు మాట్లాడుకుని ఇంట్లో కలుసుకున్నారు. వంటగదిలో ఇద్దరు ఉండగా భర్త వెంకటరమణకు మెలకువ వచ్చింది. దీంతో నరసింగరావు, వెంకటరమణకు మధ్య వాగ్వాదం జరిగింది. లలితకుమారి, నరసింగరావు దాడిచేసి వెంకటరమణను చున్నీతో ఉరి వేసి హత్య చేశారు. తర్వాత అతని మృతదేహాన్ని ఇంట్లోని ఓ గదిలో పెట్టి, నరసింగరావు పరారయ్యాడు. లలితకుమారి తన బంధువులతో భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. దీంతో బంధువులు ఆమె మాటలు నమ్మి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. 

Also Read: భర్తను పశువుల కొట్టంలో పాతేసిన భార్య, పోలీసుల దర్యాప్తులో ఎన్నో అనుమానాలు

వెంకటరమణ శరీరంపై గాయాలు 

వెంకటరమణ మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బొబ్బలి గ్రామీణ సీఐ నాగేశ్వరరావు గ్రామానికి వచ్చి విచారణ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేయగా లలితకుమారి నిజం చెప్పింది. దీంతో నిందితులు లలితకుమార్, నరసింగరావును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.  వెంకటరమణ హత్యకు గురవ్వగా, లలితకుమారి అరెస్టు కావడంతో వారి పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు. పిల్లలను బంధువుల పర్యవేక్షణలో ఉంచారు. 

Also Read: ప్రేమించుకొని తల్లితో వివాహం, ఆమె కూతురిపైనా మోజుపడి పెళ్లికి ఊహించని నాటకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Embed widget