అన్వేషించండి

Visakha Crime News: విశాఖలో మత్తు ఇంజెక్షన్ల ముఠా గుట్టురట్టు - కొరియర్ ద్వారా తీసుకొస్తూ అమ్మకాలు

Visakha Crime News: విశాఖపట్నంలో భారీగా మత్తు ఇంజెక్షన్లు అక్రమంగా విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 850 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Visakha Crime News: విశాఖలో భారీగా మత్తు ఇంజెక్షన్ల ముఠా గుట్టు రట్టు అయింది. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న డ్రగ్ మాఫియాను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 850 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి.. వాటిని కొరియర్ ద్వారా ఏపీకి తీసుకొస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ మత్తు ఇంజెక్షన్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా లక్షల్లో సంపాదించుకుంటూ అక్రమంగా బతికేస్తున్నారు. కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని బర్మా క్యాంపులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న కళ్యాణ్ కుమార్ పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజక్షన్లను.. ఉత్తర ప్రదేశ్ నుంచి కొరియర్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చి యువతకు విక్రయిస్తున్నాడు. విచ్చలవిడిగా డ్రగ్స్ బయట దొరుకుతుండడంతో యువత వీటిని కొనుగోలు చేస్తూ బానిసలుగా మారుతున్నారు. నగరంలో చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. 

మత్తులో అనేక అరాచకాలు..

యువత మాదకద్రవ్యాలను వినియోగిస్తూ ఆ మత్తులో అసాంఘిక శక్తులుగా మారి.. అనేక అరాచకాలు చేస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం, పలువురిపై హత్యాయత్నానికి పాల్పడడం వంటివి చేస్తున్నారు. యువతనే టార్గెట్ చేస్తూ.. డ్రగ్స్ మాఫియా చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే విషయం గుర్తించిన పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై నిఘా పెట్టారు. ఇప్పటికే చాలా సార్లు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నప్పటికీ.. వారిలో ఎలాంటి మార్పు లేదు. తరచుగా అదే పని చేస్తూ సులువుగా లక్షలు సంపాదిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతే లక్ష్యంగా ఒక్కొక్క ఇంజెక్షన్ వందల్లో విక్రయిస్తునట్లు గుర్తించిన పోలీసులు....నిందితుడుతో పాటు ప్రసాద్, రాంప్రసాద్ అనే ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే 850 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన కంచెరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవలే గుంటూరులోనూ డ్రగ్స్ కలకలం..

ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులకు ఉత్ప్రేరకంగా వాడే మాదక ద్రవ్యాలు మందుల రూపంలో పల్నాడు నుంచి సప్లై అవుతున్నాయని పోలీసులు నెల రోజుల క్రితం గుర్తించారు. ఈ ఉత్ప్రేరకం మందులను నర్సారావుపేట ప్రాంతంలో ఉన్న ఫార్మసీ కంపెనీలో తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా భారీ ఎత్తున జరుగుతున్న ట్రెమడాల్ ట్యాబ్లెట్ల అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఇప్పటికే కొన్ని వందల కోట్లలో ట్యాబ్లెట్లను అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. ఉగ్రవాద సంస్థలు ఐసీస్, ఆఫ్రికా ప్రాంతంలోని బోకోహరమ్ లాంటి సంస్థలు ఈ మందులను విరివిగా ఆర్డర్ చేస్తూ ఉంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులు అలసిపోకుండా నిరాటంకంగా పనిచేసేందుకు.. విధ్వంసాలకు ఒడిగట్టేందుకు  ఈ ట్రెమాడాల్ డ్రగ్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు. నొప్పుల‌ నివారణ కోసం సూక్ష్మ మోతాదులో వాడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన ఆంక్షలతో ఈ కాంబినేషన్ తో టాబ్లెట్ తయారీకి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంబినేషన్ లో మాత్రమే తయారు చేయవలసి‌ ఉంటుంది. ట్రెమాడాల్ మాదక ద్రవ్యంగా ఎక్కువగా ఉపయోగిస్తాన్నారని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget