అన్వేషించండి

ఆ తల ఎక్కడ? మదనపల్లె పోలీసులను పరుగెత్తిస్తున్న హత్య కేసు!

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

అన్నమయ్య రాజాంపేట జిల్లాలో‌ దారుణం జరిగింది. బైక్‌లో వెళ్తున్న వ్యక్తిపై కారం చల్లి అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో కలకలం రేపుతుంది. మదనపల్లె - బెంగళూరు జాతీయ‌ రహదారిలోని జవుకపల్లె తోపు వద్ద సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తల నరికి మొండెం వేరు చేసి తలను ఎత్తుకెళ్ళారు దుండగులు. స్ధానికుల సమాచారంతో ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. 

అన్నమయ్య రాజాంపేట జిల్లా నిమ్మనపల్లెకు చెందిన రమేష్ మదనపల్లె ఓ ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్ తరచూ బయట ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్ళి వచ్చేవాడు. అయితే సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయల్దేరాడు. మదనపల్లె - బెంగళూరు జాతీయ రహదారిలోని జవుకపల్లె తోపు వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. 

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి మదనపల్లె రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఎత్తు కెళ్ళిన తల భాగం లభ్యం అయితే గానీ కేసు ఛేదించేందుకు వీలు లేదంటున్నారు. అందుకే తల ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. సంఘటన స్ధలంలో డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన స్ధలంలో క్లూస్ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకూ పోలీసులు తల భాగం కోసం పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు.

పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ధారబురుజు వద్ద జరిగిన హత్య కేసులో రమేష్ ఏ2 ముద్దాయిగా ఉన్నాడు. అందులో బాధితులేమైనా రియాక్ట్ అయ్యారా అని ఖాకీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధారబురుజు వద్ద జరిగిన హత్య సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ హత్య పెను సంచలనంగా మారుతోంది. 

ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన కేసులు చాలా సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్నఢిల్లీలో ప్రియురాలిని హత్య చేసి ముక్కలు చేసి ఢిల్లీ నగర వీధుల్లో పడేశాడో ప్రియుడు. తాజాగా బిహార్ కు చెందిన ఓ వ్యక్తి  తన చెల్లెలి ప్రియుడిపై కోపం పెంచుకుని నిరకేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు.

బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget