అన్వేషించండి

ఆ తల ఎక్కడ? మదనపల్లె పోలీసులను పరుగెత్తిస్తున్న హత్య కేసు!

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

అన్నమయ్య రాజాంపేట జిల్లాలో‌ దారుణం జరిగింది. బైక్‌లో వెళ్తున్న వ్యక్తిపై కారం చల్లి అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో కలకలం రేపుతుంది. మదనపల్లె - బెంగళూరు జాతీయ‌ రహదారిలోని జవుకపల్లె తోపు వద్ద సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తల నరికి మొండెం వేరు చేసి తలను ఎత్తుకెళ్ళారు దుండగులు. స్ధానికుల సమాచారంతో ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. 

అన్నమయ్య రాజాంపేట జిల్లా నిమ్మనపల్లెకు చెందిన రమేష్ మదనపల్లె ఓ ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్ తరచూ బయట ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్ళి వచ్చేవాడు. అయితే సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయల్దేరాడు. మదనపల్లె - బెంగళూరు జాతీయ రహదారిలోని జవుకపల్లె తోపు వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. 

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి మదనపల్లె రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఎత్తు కెళ్ళిన తల భాగం లభ్యం అయితే గానీ కేసు ఛేదించేందుకు వీలు లేదంటున్నారు. అందుకే తల ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. సంఘటన స్ధలంలో డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన స్ధలంలో క్లూస్ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకూ పోలీసులు తల భాగం కోసం పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు.

పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ధారబురుజు వద్ద జరిగిన హత్య కేసులో రమేష్ ఏ2 ముద్దాయిగా ఉన్నాడు. అందులో బాధితులేమైనా రియాక్ట్ అయ్యారా అని ఖాకీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధారబురుజు వద్ద జరిగిన హత్య సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ హత్య పెను సంచలనంగా మారుతోంది. 

ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన కేసులు చాలా సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్నఢిల్లీలో ప్రియురాలిని హత్య చేసి ముక్కలు చేసి ఢిల్లీ నగర వీధుల్లో పడేశాడో ప్రియుడు. తాజాగా బిహార్ కు చెందిన ఓ వ్యక్తి  తన చెల్లెలి ప్రియుడిపై కోపం పెంచుకుని నిరకేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు.

బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget