![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం
Visakha Severe Accident: విశాఖలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వేగంగా వచ్చి రెయిలింగ్ వాల్ ను ఢీకొని కింద పడ్డారు.
![Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం two youth died in an accident in visakha flyover Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/66893b236069440cdfc501ed086114e41715497101316876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Two Youth Died In An Accident In Visakha: విశాఖలో (Visakha) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ఏడీ కొత్త రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై (NAD Flyover) శనివారం రాత్రి బైక్ పై ముగ్గురు యువకులు వేగంగా వచ్చి మలుపు వద్ద అదుపు తప్పి వాల్ ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ముగ్గురూ ఎగిరి ఫ్లై ఓవర్ పై నుంచి కింద రహదారిపై పడ్డారు. ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని కేజీహెచ్ కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)