అన్వేషించండి

Manyam News: మన్యం జిల్లాలో విషాదం, ఆడుకుంటూ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

 Manyam News: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Manyam News: పార్వతీపురం మన్యం జిల్లా జవదాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన మూడేళ్ల జానకి, రెండున్నరేళ్ల కృష్ణ ప్రసాద్ లు కలిసే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి కలిసే ఇంటికి తిరగి వచ్చారు. పక్కపక్కనే వీరిద్దరి ఇళ్లు ఉండటంతో... అక్కడి నుంచి వచ్చాక కూడా కలిసే ఆడుకున్నారు. అయితే రోజులాగే పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండిపోయారు. 

ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు ఇద్దరు సమీపంలో ఉన్న చెరువు వైపు వెళ్లారు. ప్రమాద వశాత్తు అందులో పడి చనిపోయారు. చాలా సేపవడం, ఎండ ఎక్కువగా కొట్టడంతో పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు బయటకు వచ్చారు. బయట ఎక్కడా కనిపించకోవడంతో వెతుకులాట మొదలు పెట్టారు. గ్రామంలో ఉన్న వాళ్లనీ వీళ్లని అడుగుతూ చిన్నారుల కోసం గాలించారు. అయితే చెరువు వైపు వెళ్లినట్లు కనిపించారని ఎవరో చెప్పడంతో అటువైపు వెళ్లారు. పిల్లలు ఇద్దరూ చెరువులో పడి చనిపోవడాన్ని చూసి షాకయ్యారు. ఇప్పటి వరకూ తమ కళ్ల ముందే ఉన్న పిల్లలు చెరువులో శవాలుగా తేలడాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

భార్యపై అనుమానంతో పిల్లలను చెరువులో వేసిన తండ్రి..

భార్య మీద అనుమానంతో సైకోలా వ్యవ‌హ‌రించాడో భర్త. కన్న బిడ్డలను కాలువలో తోసి చంపాడు. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుంచనపల్లి బాకింహంగ్ కెనాల్ లో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తండ్రి వెంకటేశ్వరరావు పిల్లలను చంపి కాలువలో పడేసినట్లు పోలీసుల నిర్థారించారు. మృతులు జోష్ణ(6) బాలిక, షణ్ముఖ వర్మ (4) బాలుడు గుర్తించారు. నిన్నటి నుంచి పిల్లలు కనిపించడంలేదని వెంకటేశ్వరరావు భార్య పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.   

తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..

పెద్దకాకాని పోలీస్ స్టేషన్ లో తన ఇద్దరు పిల్లలు కనిపించడంలేదని వివాహిత సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో పెదకాకానికి చెందిన జోష్ణ(6), షణ్ముఖ వర్మ(4) కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లి వద్ద డెల్టా కాల్వలో ఇద్దరు పిల్లలను తండ్రి వెంకటేశ్వరరావు పడేసినట్లు పోలీసులు తెలిపారు.  వెంకటేశ్వరరావును పోలీసులు విచారించగా పిల్లలను పడేసిన ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశంలో పిల్లల మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భార్య పై అనుమానంతో పిల్లలను కాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హోమ్ కెనాల్ లో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు పెదకాకాని పోలీసులు. 

కేసు నమోదు...

భార్యపై అనుమానంతో క‌న్న పిల్లలనే ఓ తండ్రి క‌డ‌తేర్చాడు. పోలీసుల క‌థ‌నం ప్రకారం పెద‌కాకానికి చెందిన వెంక‌టేశ్వర‌రావు త‌న భార్యపై అనుమానం ఉంది. సైకోలా మారిన అత‌డు ముక్కుప‌చ్చలార‌ని ప‌సి పిల్లల‌ను కుంచ‌న‌ప‌ల్లిలోని బ‌కింగ్ హామ్ కెనాల్‌లో ప‌డేశాడు. పిల్లలు క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో తల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు కాలువ‌లో  చిన్నారుల మృత‌దేహాల‌ను గుర్తించి బ‌య‌ట‌కుతీశారు. అభం శుభం తెలియ‌ని ప‌సిపిల్లల‌ను పొట్టన పెట్టుకున్న తండ్రిని పోలీసులు విచారించ‌గా తానే కెనాల్‌లో తోసేశానని ఒప్పుకున్నాడు. పెద‌కాకాని పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Saeed Hussain Shah killed: హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం -  పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం - పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
Embed widget