అన్వేషించండి

TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

 TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు తాళలేక ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఉరి వేసుకుంటున్న, పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు చెప్పి బలవన్మరణం చెందాడు.

TSRTC Driver Suicide: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పొద్దటూరు అశోక్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకు ముందే కూలి పనికి వెళ్తున్న భార్యను పొలం వద్ద ఆయన దింపి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే భార్యకు ఫోన్ చేసి.. నేను ఉరి వేసుకుంటున్న, పిల్లలు జాగ్రత్త అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. షాక్ అయిన భార్య భర్తకు ఏమైందో తెలియక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే అతడు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంటి తలుపులు తెరిచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్పటి వరకు బాగానే ఉన్న భర్త సడెన్ గా బలవన్మరణం చేసుకోవడం జీర్ణించుకోలేని ఆ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న అశోక్ గత కొంత కాలంగా కార్గో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఆయన నడుపుతున్న బస్సుకు డ్యామేజీ అయింది. దీంతో అధికారులు అతడిని డ్రైవర్ పని నుంచి తొలగించి.. డిపో వద్ద పార్కింగ్ పని అప్పగించారు. పగలు విధులు ఇవ్వాలంటే బస్సు డ్యామేజీకి పెనాల్టీ మొత్తం చెల్లించాలంటూ అధికారులు వేధిస్తున్నారంటూ భార్య లావణ్యకు పలుమార్లు చెప్పాడు. ఇదే విషయంపై చాలా రోజులుగా డల్ గా ఉన్నాడని.. మానసికంగా కుంగిపోయిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తన భర్త చావుకు పరోక్షంగా కారణం అయిన అధికారులపై కఠిన తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

మేమేం వేధించలేదు.. డ్యూటీ మార్చామంతే!

డ్రైవర్ ఆశోక్ ఈనెల 21వ తేదీన విధులు నిర్వహించి ఇంటికి వెళ్లాడని... 22వ తేదీన అతడికి వారాంతపు సెలవు కావడంతో ఆరోజు రాలేదని మెహదీపట్నం డిపో మేనేజర్ సూర్య నారాయణ తెలిపారు. బస్సు డ్యామేజీ అయిందని తెలిసి 23వ తేదీన పార్కింగ్ వద్ద రాత్రి డ్యూటీ వేసినట్లు వివరించారు. అంతేకాని అతడిని ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారు. డ్రైవర్ అశోక్ ను మేం వేధించామని చెప్పడం అవాస్తంవం అంటూ చెప్పుకొచ్చారు. 

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

ఇటీవలే మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని వీకర్స్ కాలనీలో ఉంటున్న చెన్నల ధనలక్ష్మి (23), అనే మహిళ తన కూతుర్లు సమన్విత (6),  శంకరమ్మ (6నెలల చిన్నారి) లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు పోలీసులు. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకుందని, భర్త సాయన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన చెన్నల సాయన్న కుటుంబం బతుకు దెరువు కోసం లక్షేట్టిపేటకు వలసవెళ్లారు. తన భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో భర్త సాయన్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచానామా చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.  ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: 633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
GATE 2026 షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు- పరీక్ష ప్రాముఖ్యత ఇదే
GATE 2026 షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు- పరీక్ష ప్రాముఖ్యత ఇదే
Kishkindhapuri Release Date: సెప్టెంబర్‌లో బెల్లంకొండ 'కిష్కిందపురి'... థియేటర్లలోకి హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
సెప్టెంబర్‌లో బెల్లంకొండ 'కిష్కిందపురి'... థియేటర్లలోకి హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
Kadapa Politics: నాకు ఏమైనా జరిగితే లోకేష్, బీటెక్ రవిలదే బాధ్యత- వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం
నాకు ఏమైనా జరిగితే లోకేష్, బీటెక్ రవిలదే బాధ్యత- వైసీపీ నేత సతీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

SS Rajamouli on SSMB 29 November Revelation | చరిత్ర చూడని అద్భుతాన్ని చూస్తారంటున్న రాజమౌళి | ABP Desam
SS Rajamouli Reveals SSMB 29 Mahesh babu Pre look | రాజమౌళి నుంచి ఊహించని సర్ ప్రైజ్ | ABP Desam
PM Modi Master Plan With Russia | ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడనుందా.? | ABP Desam
Virat Kohli Grey Beard | సింగిల్ ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసిన కోహ్లీ | ABP Desam
Rajasthan Royals New Captain Dhruv Jurel | Sanju Samson పొమ్మనలకే పొగబెట్టారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: 633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
GATE 2026 షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు- పరీక్ష ప్రాముఖ్యత ఇదే
GATE 2026 షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు- పరీక్ష ప్రాముఖ్యత ఇదే
Kishkindhapuri Release Date: సెప్టెంబర్‌లో బెల్లంకొండ 'కిష్కిందపురి'... థియేటర్లలోకి హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
సెప్టెంబర్‌లో బెల్లంకొండ 'కిష్కిందపురి'... థియేటర్లలోకి హారర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
Kadapa Politics: నాకు ఏమైనా జరిగితే లోకేష్, బీటెక్ రవిలదే బాధ్యత- వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం
నాకు ఏమైనా జరిగితే లోకేష్, బీటెక్ రవిలదే బాధ్యత- వైసీపీ నేత సతీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్... 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో రీ ఎంట్రీ - ఫస్ట్ లుక్ రిలీజ్
వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్... 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో రీ ఎంట్రీ - ఫస్ట్ లుక్ రిలీజ్
KCR Rakhi Celebrations: కేసీఆర్ ఇంట్లో రాఖీ సంబరాలు, కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ ఇంట్లో రాఖీ సంబరాలు, కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత
Guntur Shankar Vilas Bridge: గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత - కొత్త ROB పనులు స్టార్ట్ - ట్రాఫిక్ ఇక్కట్లు కూడా !
గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత - కొత్త ROB పనులు స్టార్ట్ - ట్రాఫిక్ ఇక్కట్లు కూడా !
PM Modi: రేపు బెంగళూరుకు ప్రధాని మోదీ, మెట్రో లైన్‌తో పాటు 3 వందే భారత్ రైళ్లు ప్రారంభం
రేపు బెంగళూరుకు ప్రధాని మోదీ, మెట్రో లైన్‌తో పాటు 3 వందే భారత్ రైళ్లు ప్రారంభం
Embed widget