By: ABP Desam | Updated at : 07 Jan 2022 06:01 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వనమా రాఘవేంద్రరావు (ఫైల్ ఫొటో)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు.... వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపారు.
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
మరో బాధిత కుటుంబం ఆవేదన
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వనమా రాఘవ వేధింపులకు ఆరునెలల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సూసైడ్ నోట్ లో రాఘవతో పాటు 42 మంది పేర్లు రాసినప్పటికీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వెంకటేశ్వర్లకు చెందిన భూమి విషయంలో వనమా రాఘవ రూ. 10 లక్షలు తీసుకొని, వేరే వారికి మద్దతు పలికాడని వెంకటేశ్వర్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు వేరే కేసులో ఇరికించి జైలుకు పంపడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఈ కేసులో పోలీసుల పైనా ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఆత్మహత్యపై జాప్యం చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడే సరైన శిక్ష వేస్తే రామకృష్ణ కుటుంబం బతికి ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాఘవపై చర్యలు తీసుకొని తమ లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పోలీసుల అదుపులో నలుగురు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక సెటిల్మెంట్లలో రాఘవతో భాగస్వాములయ్యారని, రామకృష్ణ పంచాయతీ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఈ నలుగురు వ్యక్తులపై ఇప్పటికే అనేక అభియోగాలున్నాయి. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Tamilnadu Murder: దుప్పటి కప్పుకున్న భార్యపై భర్త కత్తి పోట్లు - ఆమె ముఖం చూసి షాక్!
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్తో చివరకు ఊహించని ట్విస్ట్
CM KCR: నేడు చండీగఢ్కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Breaking News Live Updates: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే