అన్వేషించండి

Tirupati Crime News: లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు.. పిల్లలకు ఉరేసి, తల్లి ఆత్మహత్య.. తిరుపతిలో కన్నీళ్లు పెట్టించే ఘటన

Woman Suicide | తిరుపతి జిల్లాలో విషాదం చోటుచసుకుంది. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోగా, అప్పులు చేస్తూ పోతున్నాడు. దాంతో ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి జిల్లా పుత్తూరులో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యత లేకుండా తిరగడంతో పాటు దొరికిన చొటల్లా అప్పులు చేయడంతో మనస్తాపం చెందిన పద్మ(28) అనే వివాహిత, తన ఇద్దరు కుమార్తెలు తేజ(6), లాస్య(5)లను ఉరేసి చంపి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తన జీవితం ఇతరులకు ఒక గుణపాఠం కావాలని ఆమె రాసిన సూసైట్ నోట్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలోని పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన పద్మ, శివశంకర్‌లు డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. శివశంకర్ తో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు నిరాకరించారు. అతడు ఏ పని లేకుండా తిరుగుతున్నాడని, కులాలు సైతం వేరు అని పద్మను పెద్దలు మందలించారు. కానీ పెద్దలను ఎదిరించి 2019లో పద్మ, శివశంకర్ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత మారని భర్త.. భారీగా అప్పులు

సాధారణంగా బాధ్యత లేకుండా ఉండే వారు పెళ్లయ్యాక సెట్ అవుతారని పెద్దలు చెబుతుంటారు. కానీ అందరి విషయంలో అది నిజం కాదని పద్మ ఘటనే నిరూపించింది. పెళ్లయ్యాక కూడా శివశంకర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. జాబ్ చేయడం లేదు. ఏ పని చేయకపోగా వీలున్న చోటల్లా అప్పులు చేస్తూ వచ్చాడు. ఇద్దరు పిల్లలు తేజ, లాస్యలు పుట్టినా భార్యను, పిల్లల బాధ్యత తీసుకోలేదు. ఇంటి అద్దె చెల్లించడానికి, మరోవైపు పిల్లల స్కూలు ఫీజుల కోసం  పద్మ ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం వీరు పిల్లల చదువుల కోసం పుత్తూరులో నివాసం ఉంటున్నారు.

డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఆమె కొంత లోన్ తీసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి శివశంకర్ ను మందలించగా కుటుంబాన్ని పోషిస్తానని, బాధ్యతగా ఉంటానని చెప్పాడు. కానీ తీసుకున్న అప్పును భర్త తీర్చకపోవడం, పిల్లలకు స్కూల్ ఫీజులు, వారి పోషణ సైతం బారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటి నుంచి వెళ్లిన భర్తను అప్పు గురించి అడకడంతో చెల్లించలేదని చెప్పాడు. దాంతో అవమాన భారాన్ని తట్టుకోలేక, పిల్లల్ని పోషించలేక పద్మ కఠిన నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు చీరతో ఉరేసింది. తరువాత తాను హాల్లో ఉరేసుకుని చనిపోయింది. ఇంటికి వచ్చిన భర్తకు డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి మామకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చాక తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చనిపోయి కనిపించారు. పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

కష్టాలు వివరిస్తూ సూసైడ్ నోట్..

పెద్దల్ని ఎదరించి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అమ్మాయికి అస్సలు నచ్చని లక్షణాలన్నీ నా భర్తకు ఉన్నాయి. పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పులు తీర్చకపోతే, కుటుంబాన్ని పోషించకపోతే నేనేం చేయాలి. ఇక ఉంటాను. నేను చనిపోయాక మళ్లీ పెళ్లి చేసుకుంటావు, అయితే సెటిల్ అయ్యాక చేసుకో అని పద్మ సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
Cheapest Sports Bikes: హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
TVk Vijay: తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
Embed widget