అన్వేషించండి

Quarry Accident: ఏపీలో తీవ్ర విషాదం - క్వారీ ప్రమాదంలో రాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి

Andhrapradesh News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.

Quarry Accident In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) సోమవారం జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంచికచర్ల (Kanchikacharla) మండలం పరిటాల వద్ద క్వార్ట్జ్ రాత్రి క్వారీలో మైనింగ్ సాగుతోంది. ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో పై నుంచి లూజు బోల్డర్స్ జారి పెద్ద మొత్తంలో డ్రిల్లింగ్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారి కోసం తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని.. బ్లాస్టింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

తిరుపతిలో తీవ్ర విషాదం

అటు, తిరుపతి (Tirupati) జిల్లాలోనూ ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. ఏర్పేడు మండలం వెంకటగిరి రహదారిపై ఆమడూరులో ఓ తల్లి, ఇద్దరు పిల్లలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సహా ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన శారద, శివ దంపతులు. వీరికి కుమారుడు గురు కార్తిక్ (4), కుమార్తె గురువైష్ణవి (2) ఉన్నారు. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి శారద తన తల్లి విజయమ్మ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చింది. తల్లి విజయమ్మ, ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చిన శారద రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి తన భర్తకు కాల్ చేసి చెప్పింది. భర్త బైక్ తీసుకుని వస్తుండగా.. అతని కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే పిల్లలతో ఎదురుచూసింది.

దూసుకెళ్లిన లారీ

ఇదే సమయంలో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాకీల సాయంతో చక్రాలను పైకి లేపి ఇరుక్కున శారదను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు తీవ్ర గాయాలైన తల్లి విజయమ్మ, గురుకార్తీక్‌లను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే శారద మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతులు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Embed widget