అన్వేషించండి

Quarry Accident: ఏపీలో తీవ్ర విషాదం - క్వారీ ప్రమాదంలో రాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి

Andhrapradesh News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.

Quarry Accident In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) సోమవారం జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంచికచర్ల (Kanchikacharla) మండలం పరిటాల వద్ద క్వార్ట్జ్ రాత్రి క్వారీలో మైనింగ్ సాగుతోంది. ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో పై నుంచి లూజు బోల్డర్స్ జారి పెద్ద మొత్తంలో డ్రిల్లింగ్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారి కోసం తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని.. బ్లాస్టింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

తిరుపతిలో తీవ్ర విషాదం

అటు, తిరుపతి (Tirupati) జిల్లాలోనూ ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. ఏర్పేడు మండలం వెంకటగిరి రహదారిపై ఆమడూరులో ఓ తల్లి, ఇద్దరు పిల్లలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సహా ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన శారద, శివ దంపతులు. వీరికి కుమారుడు గురు కార్తిక్ (4), కుమార్తె గురువైష్ణవి (2) ఉన్నారు. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి శారద తన తల్లి విజయమ్మ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చింది. తల్లి విజయమ్మ, ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చిన శారద రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి తన భర్తకు కాల్ చేసి చెప్పింది. భర్త బైక్ తీసుకుని వస్తుండగా.. అతని కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే పిల్లలతో ఎదురుచూసింది.

దూసుకెళ్లిన లారీ

ఇదే సమయంలో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాకీల సాయంతో చక్రాలను పైకి లేపి ఇరుక్కున శారదను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు తీవ్ర గాయాలైన తల్లి విజయమ్మ, గురుకార్తీక్‌లను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే శారద మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతులు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol and diesel shortage: రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
Viral Video: సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
Sodara OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kidney Stones : కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
Nara Lokesh Speech: మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Embed widget