అన్వేషించండి

Quarry Accident: ఏపీలో తీవ్ర విషాదం - క్వారీ ప్రమాదంలో రాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి

Andhrapradesh News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.

Quarry Accident In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) సోమవారం జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంచికచర్ల (Kanchikacharla) మండలం పరిటాల వద్ద క్వార్ట్జ్ రాత్రి క్వారీలో మైనింగ్ సాగుతోంది. ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో పై నుంచి లూజు బోల్డర్స్ జారి పెద్ద మొత్తంలో డ్రిల్లింగ్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారి కోసం తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని.. బ్లాస్టింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

తిరుపతిలో తీవ్ర విషాదం

అటు, తిరుపతి (Tirupati) జిల్లాలోనూ ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. ఏర్పేడు మండలం వెంకటగిరి రహదారిపై ఆమడూరులో ఓ తల్లి, ఇద్దరు పిల్లలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సహా ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన శారద, శివ దంపతులు. వీరికి కుమారుడు గురు కార్తిక్ (4), కుమార్తె గురువైష్ణవి (2) ఉన్నారు. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి శారద తన తల్లి విజయమ్మ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చింది. తల్లి విజయమ్మ, ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చిన శారద రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి తన భర్తకు కాల్ చేసి చెప్పింది. భర్త బైక్ తీసుకుని వస్తుండగా.. అతని కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే పిల్లలతో ఎదురుచూసింది.

దూసుకెళ్లిన లారీ

ఇదే సమయంలో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాకీల సాయంతో చక్రాలను పైకి లేపి ఇరుక్కున శారదను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు తీవ్ర గాయాలైన తల్లి విజయమ్మ, గురుకార్తీక్‌లను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే శారద మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతులు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Embed widget