అన్వేషించండి

Quarry Accident: ఏపీలో తీవ్ర విషాదం - క్వారీ ప్రమాదంలో రాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి

Andhrapradesh News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.

Quarry Accident In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) సోమవారం జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంచికచర్ల (Kanchikacharla) మండలం పరిటాల వద్ద క్వార్ట్జ్ రాత్రి క్వారీలో మైనింగ్ సాగుతోంది. ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో పై నుంచి లూజు బోల్డర్స్ జారి పెద్ద మొత్తంలో డ్రిల్లింగ్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారి కోసం తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని.. బ్లాస్టింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

తిరుపతిలో తీవ్ర విషాదం

అటు, తిరుపతి (Tirupati) జిల్లాలోనూ ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. ఏర్పేడు మండలం వెంకటగిరి రహదారిపై ఆమడూరులో ఓ తల్లి, ఇద్దరు పిల్లలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సహా ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన శారద, శివ దంపతులు. వీరికి కుమారుడు గురు కార్తిక్ (4), కుమార్తె గురువైష్ణవి (2) ఉన్నారు. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి శారద తన తల్లి విజయమ్మ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చింది. తల్లి విజయమ్మ, ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చిన శారద రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి తన భర్తకు కాల్ చేసి చెప్పింది. భర్త బైక్ తీసుకుని వస్తుండగా.. అతని కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే పిల్లలతో ఎదురుచూసింది.

దూసుకెళ్లిన లారీ

ఇదే సమయంలో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాకీల సాయంతో చక్రాలను పైకి లేపి ఇరుక్కున శారదను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు తీవ్ర గాయాలైన తల్లి విజయమ్మ, గురుకార్తీక్‌లను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే శారద మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతులు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. లవర్ చనిపోవడమే కారణమా?
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. లవర్ చనిపోవడమే కారణమా?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Vijay Deverakonda Rashmika : రణబాలి వెడ్స్ జయమ్మ - చూడముచ్చటగా కొత్త జంట... విరోష్ కపుల్ వెడ్డింగ్ గిఫ్ట్
రణబాలి వెడ్స్ జయమ్మ - చూడముచ్చటగా కొత్త జంట... విరోష్ కపుల్ వెడ్డింగ్ గిఫ్ట్
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
Dacoit Rubaroo Song : డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ - లవ్ స్టోరీ విత్ బ్రేకప్ ఎమోషన్ ఎలివేట్ చేసే లిరిక్స్
డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ - లవ్ స్టోరీ విత్ బ్రేకప్ ఎమోషన్ ఎలివేట్ చేసే లిరిక్స్
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Mrithyunjay Trailer : ఓటమి భయంతో యుద్ధం చేయకపోవడమే తప్పు - శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' ట్రైలర్ చూశారా?
ఓటమి భయంతో యుద్ధం చేయకపోవడమే తప్పు - శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' ట్రైలర్ చూశారా?
Embed widget